మెల్ బోర్న్: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో ఎనిమిదో వికెట్టు కోల్పోయింది. రాన్ హారిస్(74) పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో ఎనిమిదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు ఐదు వికెట్ల నష్టానికి 259 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో శనివారం రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ మరింత దూకుడుగా ఆడింది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ సెంచరీ చేయడంతో పాటు..బ్రాడ్ హాడిన్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
హాడిన్ ఆరు వికెట్టు రూపంలో 55 పరుగుల వద్ద పెవిలియన్ కు చేరగా.. మిచెల్ జాన్సన్ 28 పరుగులు చేసి అవుటయ్యాడు.ఆ తరుణంలో స్మిత్ కు జత కలిసిన ర్యాన్ హారిస్(52*) పరుగులు ఆటను కొనసాగిస్తున్నాడు.