ఆస్ట్రేలియాదే సిరీస్ | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాదే సిరీస్

Published Sun, Nov 29 2015 3:55 PM

ఆస్ట్రేలియాదే సిరీస్

అడిలైడ్:న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్టుల క్రికెట్ సిరీస్ ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. తొలిసారి ఇరు జట్ల మధ్య ప్రయోగాత్మకం ప్రవేశపెట్టిన డే అండ్ నైట్ టెస్టులో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ ను దక్కించుకుంది.న్యూజిలాండ్ విసిరిన 187 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్  ఏడు వికెట్లు కోల్పోయి సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్ ను ఆసీస్ 2-0 తేడాతో గెలుచుకుంది. తొలి టెస్టులో ఆసీస్ విజయం సాధించగా, రెండో టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.


116/5 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం మూడో రోజు  రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 208 పరుగులకు ఆలౌటయింది. అనంతరం సాధారణ స్కోరుతో బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ పోరాడి గెలిచింది. ఒకపక్క బౌల్ట్ పదునైన బంతులతో ఆసీస్ ను ఇబ్బందిపెట్టినా విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయాడు. ఆసీస్ ఆటగాళ్లలో  డేవిడ్ వార్నర్ (35),షాన్ మార్ష్(49), మిచెల్ మార్ష్(28)లు ఫర్వాలేదనిపించగా, స్టీవ్ స్మిత్(14), బర్న్స్(11), నేవిల్(10)లు నిరాశపరిచారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ ఐదు వికెట్లు సాధించాడు.

 

న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 202 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 208 ఆలౌట్

ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 224 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 187/7
 

Advertisement
Advertisement