పాకిస్తాన్కు వెళ్లేది లేదు: బాయ్ | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్కు వెళ్లేది లేదు: బాయ్

Published Sun, Oct 2 2016 1:42 AM

పాకిస్తాన్కు వెళ్లేది లేదు: బాయ్ - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్‌ను ఒంటరి చేసే వ్యూహంలో విజయవంతమైనట్టే.. క్రీడల్లోనూ భారత్ ఆ దేశంతో దాదాపుగా తెగదెంపులు చేసుకుంటోంది. ఇప్పటికే ఐసీసీ టోర్నీల్లో తమ జట్టును పాక్ ఉన్న గ్రూపులో ఆడించకూడదని బీసీసీఐ కోరిన విషయం తెలిసిందే. తాజాగా భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఈ జాబితాలో చేరింది. ఈనెల 18 నుంచి 21 వరకు ఇస్లామాబాద్‌లో పాకిస్తాన్ అంతర్జాతీయ సిరీస్ జరగనుంది. అరుుతే ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు పాల్గొనడం లేదని బాయ్ స్పష్టం చేసింది.

Advertisement
Advertisement