ముంబై: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల్లో ఇరుక్కున్న అజిత్ చండిలా, హికేన్ షాలపై నిర్ణయాన్ని బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ ఈనెల 18కి వాయిదా వేసింది. పాక్ అంపైర్ అసద్ రవూఫ్ తనపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలపై సమాధానమిచ్చేందుకు మరికొంత సమయం కావాలని కోరడంతో మంగళవారం సమావేశమైన కమిటీ అంగీకరించింది.