ఆ ఒప్పందానికి చట్ట సమ్మతి ఉంది | Sakshi
Sakshi News home page

ఆ ఒప్పందానికి చట్ట సమ్మతి ఉంది

Published Wed, Jan 6 2016 3:00 AM

MoU with India was legally binding: PCB's legal team

కరాచీ: భారత క్రికెట్ జట్టుతో గతేడాది ఐదు ద్వైపాక్షిక సిరీస్‌ల కోసం కుదుర్చుకున్న ఒప్పందానికి చట్టపరమైన సమ్మతి ఉందని పాక్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఇది కేవలం ఇరుపక్షాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం మాత్రమే కాదని గుర్తుచేసింది. ఈ ఎంఓయూను పూర్తిగా పరిశీలించిన తమ న్యాయ నిపుణులు ఈమేరకు సలహా ఇచ్చారని తెలిపింది. అందుకే గత డిసెంబర్‌లో రెండు జట్ల మధ్య జరగాల్సిన సిరీస్ రద్దు కావడంపై బీసీసీఐని నష్టపరిహారం కోరే విషయం ఆలోచిస్తున్నామని పీసీబీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.  
 

Advertisement
Advertisement