గ్రాస్ ఐలెట్: నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా వెస్టిండీస్తో జరుగుతున్నమూడో టెస్టు మ్యాచ్ లో ఫలితం వచ్చే అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి. వెస్టిండీస్ను తొలి ఇన్నింగ్స్లో 225 పరుగులకే కట్టడి చేసి పైచేయి సాధించిన భారత్ తన రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. దీంతో భారత్కు 285 పరుగుల ఆధిక్యం లభించింది. నాల్గో రోజు ఆటలో భాగంగా శుక్రవారం ఆట ముగిసే సమయానికి అజింక్యా రహానే(51 బ్యాటింగ్), రోహిత్ శర్మ(41) క్రీజ్లో ఉన్నారు. ఆటకు శనివారం చివరిరోజు కావడంతో టెస్టు మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉంది. ఏమైనా అద్భుతాలు జరిగితే తప్ప మ్యాచ్ ఫలితం వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. కాగా, ఆఖరి రోజు ఆటలో భారత్ తన ఇన్నింగ్స్ ను తొందరగా ముగించి ఫలితం కోసం ప్రయత్నించే అవకాశం ఉంది.
అంతకుముందు భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ ధాటికి వెస్టిండీస్ జట్టు కుప్ప కూలింది. భువనేశ్వర్ ఐదు వికెట్లు సాధించడంతో భారత్కు 128 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. విండీస్ ఇన్నింగ్స్లో బ్రాత్వైట్ (163 బంతుల్లో 64; 6 ఫోర్లు), మార్లన్ శామ్యూల్స్ (109 బంతుల్లో 48; 7 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతావారు విఫలమయ్యారు. ఈ సిరీస్లో తొలి టెస్టును గెలవగా, రెండో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
భారత తొలి ఇన్నింగ్స్ 353 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 157/3
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 225 ఆలౌట్
మూడో టెస్టులో ఫలితం వచ్చేనా?
Published Sat, Aug 13 2016 9:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement