ఆదిబన్‌కు కాంస్యం... హరికృష్ణకు తొమ్మిదో స్థానం | Sakshi
Sakshi News home page

ఆదిబన్‌కు కాంస్యం... హరికృష్ణకు తొమ్మిదో స్థానం

Published Tue, Jan 31 2017 12:14 AM

ఆదిబన్‌కు కాంస్యం... హరికృష్ణకు తొమ్మిదో స్థానం

టాటా స్టీల్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ ఆదిబన్‌ 7.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. నెదర్లాండ్స్‌లోని విక్‌ ఆన్‌ జీ నగరంలో జరిగిన ఈ టోర్నీలో ప్రపంచ చాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే)తో కలిపి మొత్తం 14 మంది గ్రాండ్‌మాస్టర్లు 13 రౌండ్‌లపాటు పోటీపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ 6 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలువగా... సో వెస్లీ (అమెరికా–9 పాయింట్లు) స్వర్ణం, కార్ల్‌సన్‌ (8 పాయింట్లు) రజతం సాధించారు.  
 

Advertisement
Advertisement