రియో డి జనీరో: 2016లో జరిగే రియో డి జనీరో ఒలింపిక్స్ కోసం పసుపు పచ్చ రంగులో ఉన్న పిల్లిని ఎంపిక చేశారు. బ్రెజిల్లోని జంతువుల జీవితాన్ని ఇది ప్రతిబింబిస్తుందని నిర్వాహకులు తెలిపారు. పసుపు రంగు ఆ దేశ జాతీయ రంగుల్లో ఒకటి. అయితే ఈ మస్కట్కు ఇంకా పేరు పెట్టలేదు. పోలింగ్ ద్వారా ప్రజలు నిర్ణయించే పేరును వచ్చే ఆదివారం రాత్రి వెల్లడించనున్నారు.
Related news
-
ప్రెగ్నెన్నీ సమయంలో పిల్లి మాంసం తినడంతో..పాపం ఆ బిడ్డ..!
మన పెద్దవాళ్లు ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకునే ఆహారాలు బిడ్డపై ఎఫెక్ట్ చూపిస్తాయని పదేపదే చెప్పేవారు. అది ఎంతవరకు నిజమో గానీ!.. ఇక్కడొక మహిళ ఎదుర్కొంటున్న పరిస్థితిని చూస్తే అది నిజమేనేమో..! అని అనుకుంటారు. ఆమె తన పరిస్థితిని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఏం జరిగిందంటే..ఫిలిప్పీన్స్కు చెందిన అల్మా అనే మహిళకు రెండేళ్ల కొడుడు జారెన్ గమోంగన్ ఉన్నాడు. అతడు ముఖం, శరీరాన్ని కప్పి ఉంచేలా పెద్ద వెంట్రుకలతో జన్మించాడు. దీన్ని అరుదైన 'వేర్వోల్ఫ్ సిండ్రోమ్'గా పిలుస్తారు. ఇలాంటి కేసులు ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 నుంచి 100 వరకు ఉన్నాయి. అయితే జారెన్ కడుపులో ఉండగా తల్లి అల్మా అడవి పిల్లులు తినాలనే కోరిక ఎక్కువగా ఉండేదట. అదీగాక అక్కడ అపయావో ప్రాంతంలో పిల్లితో చేసే వంటకం బాగా ప్రసిద్ధి. దీంతో ఒక రోజు నల్లపిల్లిని తెచ్చుకుని వండుకుని తింది. అప్పుడు ఆమెకు ఏమి అనిపించలేదు. ఎప్పుడైతే తన కొడుకు ఇలా మెడ, వీపు, చేతులు, ముఖంపై ఓ ఎలుగుబంటి మాదిరిగా జుట్టుతో ఉండటంతో పశ్చాత్తాపం చెందడం మొదలు పెట్టింది అల్మా. తాను గర్భవతిగా ఉండగా ఆ నల్లపిల్లిని తినడం కారణంగా తన కొడుకు ఇలా పుట్టాడని, ఆ పిల్లి శాపం తనకు తగిలిందని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తోటి స్థానికులు, గ్రామస్తులు కూవా అల్మాతో అడవి పిల్లి తినడం వల్లే ఇలా జరిగిందని అనడంతో దాన్నేనమ్మడం మొదలు పెట్టింది. ఐతే అందుకు సరైన ఆధారాలు మాత్రం లేవు. ఇక్కడ ఆమె జారెన్ కంటే ముందు ఓ కుమార్తె ఉంది. ఆమెకు ఈ పరిస్థితి లేదు. కొడుకు అరుదైన పరిస్థితిని చూసి అల్మా తాను చేసిన పనికి నిందించుకుంటూ విలపిస్తోంది. వైద్యులను ఆశ్రయించినా అల్మాకు నిరాశ ఎదురయ్యింది. ఎందుకంటే వైద్యులు అల్మా కొడుకు జారెన్కు అనేక వైద్య పరీక్షలు చేసి అతడు హైపర్ట్రికోసిస్ అనే అరుదైన వైద్య పరిస్థితితో బాధపడుతున్నట్లు తెలిపారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ డెర్మటాలజీ ప్రకారం..ఈ హైపర్ట్రికోసిస్ అనేది సాధారణంగా మానవుడికి ఉండే జుట్టు కంటే అధికంగా ఏ భాగంలోనైనా పెరగొచ్చు. ఇది అరుదైన వ్యాధి అని, దీనికి చికిత్స లేదని తేల్చి చెప్పారు. అయితే జారెన్ ఇలాంటి అరుదైన పరిస్థితితో పుట్టినప్పటికీ మంచి యాక్టివ్గా అందరిలానా ఉండటం విశేషం. ఐతే ఒక్కోసారి వేడి వాతావరణంలో ఈ దట్టమైన వెంట్రుకల కారణంగా దురద పుడుతుందని చెబుతున్నాడని అల్మా వాపోయింది. తాను చాలా సార్లు జుట్టుని కత్తిరించడానికి ప్రయత్నించానని, అయితే అది పొడవుగా మందంగా ఉండటంతో కత్తిరించిన కొద్ది దట్టంగా పెరుగుతున్నట్లు చెప్పుకొచ్చింది అల్మా. అయితే లేజర్ హెయిర్ రిమూవల్ వంటి చికిత్సలు అధిక జుట్టు పెరుగుదలను తగ్గించగలవని వైద్యులు సూచించారు. దీంతో అల్మా, ఆమె భర్త తన కుమారుడి హెయిర్ రిమూవల్ సెషన్లకు నిధులు సమకూర్చే పనిలో నిమగ్నమయ్యారు. ఏదీ ఏమైనా ప్రెగ్నెన్సీ సమయంలో శిశువుకి హానికరం అనిపించేవి తీసుకోకుండా ఉంటేనే మంచిది. దేనిల్ల కొన్ని రకాల రుగ్మతలు వస్తాయన్నిది సరిగా వైద్యులు సైతం నిర్థారించలేరు, చెప్పలేరు అనేది గుర్తించుకోండి. (చదవండి: సింఘారా పిండి గురించి విన్నారా..? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
పిల్లులంటే ఇష్టమా? ఐతే తప్పకుండా ఈ మ్యూజియంకి వెళ్లాల్సిందే..!
ఎన్నో రకాల మ్యూజియంలు చూసుంటారు. ఇలా పిల్లుల కోసం ప్రత్యేకంగా ఉన్న మ్యూజియంని ఇంత వరకు చూసి ఉండరు. మన దేశంలో పిల్లిని పొద్దునే చూడటం అపశకునంగా భావిస్తారు గానీ పాశ్చాత్యులు పెంపుడు జంతువుగా పిల్లిని పెంచుకుంటారు. వాళ్లు ఏకంగా ఈ పిల్లుల కోసం ప్రత్యకంగా మ్యూజియంని ఏర్పాటు చేశారు. మరింత విశేషమేమిటంటే ఆ వ్యూజియంలో పిల్లి మమ్మీలు కూడా ఉంటాయట. ఇంతకీ ఆ మ్యూజియం ఎక్కడ ఉందంటే.. ప్రపంచంలో వింత వింత మ్యూజియంలు ఎన్నో ఉన్నాయి. మలేసియాలోని ఈ పిల్లుల మ్యూజియం కూడా అలాంటిదే! మలేసియాలోని కుచింగ్ నగరంలో ఉందిది. కుచింగ్ నార్త్ సిటీ హాల్ యాజమాన్యంలో దీనిని 1993లో నెలకొల్పారు. ఈ పిల్లుల మ్యూజియంలో పిల్లులకు సంబంధించిన దాదాపు నాలుగువేలకు పైగా కళాఖండాలు, వస్తువులు కొలువుదీరి మార్జాలాభిమానులకు కనువిందు చేస్తాయి. ఇందులో పిల్లులకు చెందిన పెయింటింగ్స్, శిల్పాలు, ఈజిప్టు నుంచి తీసుకువచ్చిన ప్రాచీన మార్జాల మమ్మీ వంటి అరుదైన వస్తువులు, పిల్లులకు సంబంధించిన ప్రకటనలు, అరుదైన జాతుల పిల్లుల చిత్రపటాలు, ఫొటోలు వంటివి అబ్బురపరుస్తాయి. ఈ పిల్లుల కళాఖండాలను తొలిసారిగా 1988లో మలేసియా ఉన్నతాధికారి దివాన్ తున్ అబ్దుల్ రజాక్ ‘పుత్ర వరల్డ్ ట్రేడ్ సెంటర్’లో ప్రదర్శించారు. తర్వాత కుచింగ్ నార్త్ సిటీ హాల్ యాజమాన్యం వీటిని సొంతం చేసుకుని, నార్త్ సిటీ హాల్ దిగువ అంతస్తులో శాశ్వతంగా ఈ పిల్లుల మ్యూజియంను ఏర్పాటు చేసింది. (చదవండి: సీతాకోక చిలుక పాలు గురిచి విన్నారా? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
పిల్లి కోసం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత
బావిలో పడిన పిల్లిని రక్షించబోయి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని నింపింది. మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బయోగ్యాస్ పిట్లోకి దిగిన ఐదుగురు వ్యక్తులు చనిపోయిన ఘటన కలకలం రేపింది. పిల్లిని రక్షించడానికి కుటుంబం మొత్తం బావిలోకి దిగింది. మొత్తం ఆరుగురు ఒకరి తర్వాత మరొకరు దూకారు. అయితే ఊపిరాడక చనిపోయిన ఐదుగురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ స్వాధీనం చేసుకుందని అహ్మద్నగర్లోని నెవాసాపోలీస్ స్టేషన్ సీనియర్ పోలీసు అధికారి ధనంజయ్ జాదవ్ తెలిపారు. బాధితులు ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో బావిలోకి దిగి ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. నడుముకి తాడు కట్టుకుని బావిలోకి ప్రవేశించిన వ్యక్తి ప్రాణాలతో బయట పడ్డాడని అతణ్ణి ఆసుపత్రిలో చేర్చినట్టు చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని వెల్లడించారు. మృతులను మాణిక్ గోవింద్ కాలే, సందీప్ మాణిక్ కాలే, బబ్లూ అనిల్ కాలే, అనిల్ బాపురావ్ కాలే, బాబాసాహెబ్ గైక్వాడ్లుగా గుర్తించారు. చిన్న కుమారుడు విజయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బావి లోపలికి దిగిన తరువాత ఊపిరాడటంలేదని ఫిర్యాదు చేయడంతో స్థానికులు వెంటనే పోలీసులకు, నిపుణులకు సమాచారం అందించారు. దీంతో సహాయక బృందాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ టీమ్లు ఆపరేషన్ను పూర్తి చేయడానికి 5 గంటలకు పైగా పట్టిందనీ, అందుకే ప్రాణనష్టం జరిగిందని స్థానికులు విమర్శించినట్టు తెలుస్తోంది. #WATCH | Five people died in a bid to save a cat who fell into an abandoned well (used as a biogas pit) in Wadki village of Ahmednagar, Maharashtra, late at night. According to Dhananjay Jadhav, Senior Police Officer of Nevasa Police station, Ahmednagar, "A rescue team… pic.twitter.com/fb4tNY7yzD — ANI (@ANI) April 10, 2024 -
మహానగరాన్ని వణికిస్తున్న పిల్లి!
ఓ పిల్లి కారణంగా ఒక మహానగరం వణికిపోతోంది. ఎప్పుడు.. ఏం వార్త వినాల్సి వస్తుందోనని జనం హడలెత్తిపోతున్నారు. కారణం.. ఆ పిల్లి ప్రమాదకరమైన రసాయనాల ట్యాంక్లో పడ్డాక అక్కడి నుంచి కనిపించకుండా పోవడమే. దీంతో ఆ పిల్లి క్యాన్సర్ కారక రసాయనాన్ని అంతటా వెదజల్లుతుందనే భయం ఆ నగరంలో నెలకొంది. జపాన్ హిరోషిమాలోని ఫుకుయామా అధికారులు ఆ పిల్లిని వెదికేందుకు పెట్రోలింగ్ను మరింతగా పెంచారు. ఆ పిల్లి ఎక్కడ కనిపించినా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలను హెచ్చరించారు. కాగా ఆ పిల్లి చివరిగా రసాయన కర్మాగారం నుండి బయటపడినట్లు భద్రతా ఫుటేజీలో కనిపించింది. ఒక కార్మికుడు ఆ పిల్లి పంజా గుర్తులను గమనించి, దానిని ఉన్నతాధికారులకు తెలిపాడు. ఆ పిల్లికి అంటుకున్న రసాయనం అత్యంత ప్రమాదకరం. దానిని ముట్టుకున్నా లేదా పీల్చినా వెంటనే శరీరంపై దద్దుర్లు, వాపు వచ్చి, తీవ్ర వ్యాధికి దారితీస్తుంది. ఫుకుయామా సిటీ హాల్లోని ఒక అధికారి మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఆ పిల్లి కోసం వెదకగా, ఇంకా దాని జాడ తెలియలేదన్నారు. అది సజీవంగా ఉందా లేదా అనేది కూడా సందేహాస్పదంగా ఉందన్నారు. ఫ్యాక్టరీ మేనేజర్ అకిహిరో కొబయాషి మాట్లాడుతూ కర్మాగారంలో రసాయన వ్యాట్ను కప్పి ఉంచే షీట్ పాక్షికంగా చిరిగిపోయిందని తెలిపారు. దానిలో పిల్లి పడి, తరువాత ఎటో వెళ్లిపోయిందని, దానికోసం తమ సిబ్బంది వెదుకుతున్నారని చెప్పారు. స్వీడన్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్కు చెందిన రసాయన ప్రమాద అంచనాలో నిపుణురాలు లిండా షెంక్ మాట్లాడుతూ సాధారణంగా పిల్లులు తమ బొచ్చును నాకుతుంటాయని, ఈ విధంగా చూస్తే ఆ పిల్లి ఇప్పటికే ఆ రసాయన్నాన్ని నాకి, చనిపోయివుంటుందన్నారు. -
Hyderabad : కిడ్స్ & పెట్స్ ఎగ్జిబిషన్ (ఫొటోలు)
Related News by category
-
Olympics–2024: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ ఈవెంట్లో తొలి అడుగు..!
'ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ ఈవెంట్లో టేబుల్ టెన్నిస్ క్రీడాంశంలో భారత్ నుంచి టీమ్ ప్రాతినిధ్యం ఎన్నడూ లేదు. వ్యక్తిగత విభాగాల్లో మన ప్లేయర్లు బరిలోకి దిగినా ఏనాడూ పతకానికి చేరువగా రాలేదు. అయితే ఈతరంలో కొత్తగా దూసుకొచ్చిన టీటీ బృందం ఆశలు రేపుతోంది. ఇటీవల వరుస విజయాలతో భారత జట్టు పారిస్ ఒలింపిక్స్–2024కు అర్హత సాధించింది. సమష్టి ప్రదర్శనలతో మన ప్యాడ్లర్లు ఆకట్టుకున్నారు. అటు పురుషుల, ఇటు మహిళల విభాగాల్లోనూ తొలిసారి భారత జట్టు.. టీమ్ ఈవెంట్స్ బరిలోకి దిగనుండటం విశేషం. దేశం తరఫున ఒలింపిక్స్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ఆ పది మంది ప్లేయర్ల వివరాలను చూస్తే..' ఆచంట శరత్ కమల్: భారత టేబుల్ టెన్నిస్లో నిస్సందేహంగా ఆల్టైమ్ గ్రేట్. చెన్నైకి చెందిన 41 ఏళ్ల శరత్ కమల్కి ఏకంగా 10సార్లు జాతీయ చాంపియన్గా నిలిచిన ఘనత ఉంది. సుదీర్ఘ కాలంగా భారత టీటీకి దిక్సూచిలా, మార్గదర్శిలా ముందుండి నడిపిస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో పలు కీలక విజయాలతో ప్రతిసారీ మన దేశ ఆశలు మోస్తున్న సీనియర్ ప్లేయర్. 2006 నుంచి 2022 మధ్య ఆరుసార్లు కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న శరత్ కమల్ 7 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు గెలుచుకున్నాడు. రెండు ఆసియా క్రీడల కాంస్యాలు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. 2004 ఒలింపిక్స్లో పాల్గొన్న అతను ఇప్పుడు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఒలింపిక్స్ బరిలోకి దిగుతుండటం విశేషం. క్రీడా పురస్కారాలు అర్జున, ఖేల్రత్నలతో పాటు పౌర పురస్కారం పద్మశ్రీ కూడా అందుకున్నాడు. సత్యన్ జ్ఞానశేఖరన్: 31 ఏళ్ల సత్యన్ స్వస్థలం చెన్నై. నాలుగేళ్ల క్రితం ప్రపంచ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్స్లో 24వ స్థానానికి చేరిన సత్యన్.. టాప్–25లోకి అడుగు పెట్టిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటికీ వరల్డ్ ర్యాంకింగ్స్లో భారత్ తరఫున అతనే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కామన్వెల్త్ క్రీడల్లో 2 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు సాధించిన సత్యన్ ఆసియా క్రీడల్లోనూ ఒక కాంస్యం అందుకున్నాడు. 2018లో అతనికి అర్జున అవార్డు దక్కింది. మానవ్ ఠక్కర్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ అండర్–18 స్థాయి ర్యాంకింగ్స్లో నంబర్వన్కు చేరుకోవడంతో మానవ్ ఠక్కర్కు తొలిసారి చెప్పుకోదగ్గ గుర్తింపు లభించింది. ఆ తర్వాత అండర్–21లోనూ అతను నంబర్వన్గా నిలిచాడు. 23 ఏళ్ల ఠక్కర్ స్వస్థలం గుజరాత్లోని రాజ్కోట్. ఇప్పటి వరకు ఆసియా క్రీడల్లో ఒక కాంస్యం, ఆసియా చాంపియన్షిప్లో 3 కాంస్యాలు సాధించాడు. శరత్ కమల్, సత్యన్ జ్ఞానశేఖరన్ తర్వాత ప్రపంచంలోని ప్రతిష్ఠాత్మక టీటీ లీగ్ బుందేస్లిగాలో ఆడిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. భారత వర్ధమాన ఆటగాళ్లలో అందరికంటే ప్రతిభావంతుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఠక్కర్ ఒలింపిక్స్లో పతకం గెలవడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. హర్మీత్ దేశాయ్: గుజరాత్లోని సూరత్కు చెందిన హర్మీత్ దేశాయ్ కామన్వెల్త్ క్రీడల్లో 2 స్వర్ణాలు, 1 కాంస్యంతో పాటు ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించాడు. ఆసియా చాంపియన్షిప్లో 3 కాంస్యాలు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. వరల్డ్ జూనియర్ చాంపియన్షిప్ను సొంతం చేసుకున్న భారత జట్టులో హర్మీత్ సభ్యుడిగా ఉన్నాడు. 30 ఏళ్ల హర్మీత్ గుజరాత్ నుంచి జాతీయ విజేతగా నిలిచిన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. క్రీడా పురస్కారం అర్జున అవార్డు అతని ఖాతాలో ఉంది. మనుష్ షా: 22 ఏళ్ల మనుష్ షా స్వస్థలం గుజరాత్లోని వడోదరా. రెండేళ్ల క్రితం సీనియర్ నేషనల్స్లో కాంస్యం సాధించడంతో వెలుగులోకి వచ్చిన అతను అంతే వేగంగా దూసుకుపోయాడు. ప్రపంచ ర్యాంకింగ్స్లో భారత్ నుంచి టాప్–100లోకి వచ్చిన పిన్న వయస్కుడిగా అతను గుర్తింపు పొందాడు. 10 ఏళ్ల క్రికెటర్గా మారే ప్రయత్నంలో అతను సాధన కొనసాగించాడు. అయితే స్కూల్లో ఎత్తు నుంచి పడిపోవడంతో డాక్టర్ల సూచనతో అవుట్డోర్ ఆటకు గుడ్బై చెప్పాల్సి వచ్చింది. అప్పుడు అతను టేబుల్ టెన్నిస్ను ఎంచుకున్నాడు. నిలకడైన ప్రదర్శనతో ఇప్పుడు భారత్ తరఫున టీమ్ ఈవెంట్లలో రెగ్యులర్ సభ్యుడిగా మారాడు. ఆకుల శ్రీజ: హైదరాబాద్కు చెందిన 25 ఏళ్ల ఆకుల శ్రీజ ఇప్పుడు భారత్ తరఫున అత్యంత విజయ వంతమైన ప్లేయర్గా కొనసాగుతోంది. 2021 సీనియర్ నేషనల్స్లో రన్నరప్గా నిలిచిన శ్రీజ తర్వాతి ఏడాది మరింత మెరుగైన ప్రదర్శన కనబరచింది. 2022లో జాతీయ సీనియర్ చాంపియన్షిప్లో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ఆమె విజేతగా నిలిచింది. 1964లో మీర్ ఖాసిం అలీ తర్వాత హైదరాబాద్ నుంచి టీటీలో జాతీయ చాంపియన్గా నిలిచిన తొలి ప్లేయర్ శ్రీజ కావడం విశేషం. రెండేళ్ల క్రితం బర్మింగ్హామ్లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించడం ఆమె కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన. చదువులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న శ్రీజ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగిగా పని చేస్తోంది. ప్రస్తుతం భారత నంబర్వన్గా ఉన్న ఈ అమ్మాయి ఒలింపిక్స్లో పతకమే లక్ష్యంగా సన్నద్ధమవుతోంది. రెండేళ్ల క్రితం శ్రీజ అర్జున అవార్డు కూడా గెలుచుకుంది. మనికా బత్రా: రెండేళ్ల క్రితం అర్చనా కామత్తో కలసి మనికా బత్రా ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్లో నాలుగో స్థానానికి చేరింది. ఏ విభాగంలోనైనా ఇప్పటి వరకు భారత్ తరఫున ఇదే అత్యుత్తమ ర్యాంకింగ్. సుదీర్ఘ కాలంగా వరుస విజయాలతో భారత టేబుల్ టెన్నిస్లో తనదైన ముద్ర వేసింది. కామన్వెల్త్ క్రీడల్లో 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం గెలుచుకున్న ఆమె ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించింది. ఇంట్లో సోదర, సోదరీలను చూసి టీటీ వైపు ఆసక్తి పెంచుకున్న 28 ఏళ్ల మనికా ఇప్పుడు భారత జట్టులో కీలక సభ్యురాలు. అర్జున, ఖేల్రత్న అవార్డులను అందుకున్న ఈ ఢిల్లీ ప్లేయర్కు మున్ముందు మరిన్ని ఘనతలు సాధించగల సత్తా ఉంది. ఆటతో పాటు అందం ఉన్న మనికకు మంచి బ్రాండింగ్ సంస్థల నుంచి మోడలింగ్ అవకాశాలు వచ్చినా.. టీటీపైనే దృష్టి పెట్టేందుకు వాటన్నింటినీ తిరస్కరించింది. ఐహికా ముఖర్జీ: కోల్కతా శివార్లలోని నైహతి ఐహికా స్వస్థలం. గత ఏడాది ఆసియా క్రీడల్లో మహిళల డబుల్స్లో సుతీర్థ ముఖర్జీతో కలసి ఐహికా సెమీఫైనల్కు చేరింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో గెలిచి కాంస్యం సొంతం చేసుకున్న ఈ జోడి ఆసియా క్రీడల మహిళల డబుల్స్లో భారత్కు తొలిసారి పతకాన్ని అందించింది. వరల్డ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో చైనా దిగ్గజం సున్ యింగ్షాపై సాధించిన పలు విజయాలు ఐహిక ఖాతాలో ఉన్నాయి. ఇటీవలే ఐహికకు అర్జున అవార్డు కూడా దక్కింది. దియా చిటాలే: ముంబైకి చెందిన 21 ఏళ్ల దియా చిటాలే జాతీయ స్థాయిలో చెప్పుకోదగ్గ ప్రదర్శనలతో గుర్తింపులోకి వచ్చింది. అండర్–15 స్థాయి నుంచి వరుసగా కేడెట్, జూనియర్ స్థాయిలలో వేర్వేరు వయో విభాగాల్లో ఆమె విజేతగా నిలిచింది. ఆటతో పాటు రెండేళ్ల క్రితం చెలరేగిన ఒక వివాదంతో దియా వార్తల్లో నిలిచింది. 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల కోసం ఎంపిక చేసిన భారత జట్టులో తనకు చోటు దక్కకపోవడంతో దియా కోర్టును ఆశ్రయించింది. తన ప్రదర్శన, రికార్డులతో ఆమె కోర్టులో పోరాడింది. చివరకు న్యాయస్థానం ఆదేశాలతో దియాకు భారత జట్టులో స్థానం లభించడం విశేషం. అర్చనా కామత్: 23 ఏళ్ల అర్చనా కామత్ స్వస్థలం బెంగళూరు. తల్లిదండ్రులిద్దరూ వైద్యులే. 11 ఏళ్ల వయసులో రాష్ట్రస్థాయి చాంపియన్షిప్ అండర్–12, అండర్–18 టైటిల్స్ సాధించి సంచలనం సృష్టించింది. 14 ఏళ్లకే అండర్–21లో కూడా విజేతగా నిలవడంతో మరింత గుర్తింపు లభించింది. 2018లో తొలిసారి సీనియర్ నేషనల్స్ గెలిచిన తర్వాత ఆమె వేగంగా దూసుకుపోయింది. 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడలకు ముందుగా జట్టులో ఎంపికై ఆ తర్వాత దియా చిటాలేకు వచ్చిన అనుకూల కోర్టు తీర్పుతో చోటు కోల్పోయింది. అయితే తర్వాతి ఏడాది సీనియర్ జాతీయ ర్యాంకింగ్ టోర్నీలో విజేతగా నిలిచి సత్తా చాటింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో డబుల్స్లో కొంతకాలంగా టాప్–15లో కొనసాగుతోంది. — మొహమ్మద్ అబ్దుల్ హాది ఇవి చదవండి: PSL 2024: నిరాశపరిచిన బాబర్.. ఫైనల్కు చేరిన షాదాబ్ ఖాన్ జట్టు -
‘డెడ్మ్యాన్’ రిటైర్డ్
మార్క్ విలియమ్ కాలవే.. అంటే ఎవరో తెలియకపోవచ్చు. కానీ అండర్ టేకర్ అంటే తెలియని వాళ్లు అరుదు. కొందరు ముద్దుగా డెడ్ మ్యాన్ అని కూడా పిలుచుకుంటారు. ముఖ్యంగా ‘90ల్లో పుట్టిన తరానికి, అందునా రెజ్లింగ్ ఇష్టంగా చూసేవారికి ఇది చాలా సుపరిచితమైన పేరు. అతనికి అతీత శక్తులుంటాయని, ఏడు జన్మలున్నాయని పిల్లల సర్కిల్లో రకరకాల పుకార్లు షికార్లు చేస్తుంటాయి. కెరీర్లో బరిలోకి దిగిన మ్యాచుల్లో 70 శాతం విజయాలతో వల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యుడబ్ల్యుఈ) లోనే ఎవరికీ అందనంత ఎత్తులో అగ్రస్థానంలో ఉన్నాడు. చీకట్లో చర్చి గంట శబ్దంతో, నీలి మెరుపులతో, నిప్పురవ్వలతో రింగులోకి వచ్చే తీరుతోనే ప్రత్యర్థిని బెదరగొట్టి అక్కడే సగం గెలిచేస్తాడు టేకర్. బలమైన ప్రత్యర్థి చేతిలో చావుదెబ్బలు తిని పడిపోతే ఇక అతని పని ముగిసినట్టే అని అందరూ అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా లేచి నిలబడతాడు. రెట్టించిన శక్తితో ప్రత్యర్థిపై విరుచుకుపడి మ్యాచ్ గెలుస్తాడు. మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం అనంతరం రెజ్లింగ్కు గుడ్బై చెప్పేశాడు ఈ లెజెండ్. ఆదివారం సర్వైవర్ సిరీస్లో తాను రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. ఫేర్వెల్ సందర్భంగా డబ్ల్యుడబ్ల్యుఈ సీయీవో విన్సెంట్ మెక్మహోన్ రింగు మధ్యలోకి వచ్చి అండర్ టేకర్ రాకను ప్రకటించాడు. ఆ సమయంలో భావోద్వేగానికి గురైన మెక్మహోన్ ‘‘30 ఏళ్లుగా అందరూ కథలు కథలుగా చెప్పుకుంటున్న ఒక కెరీర్ ముగిసిపోబోతుంది. ఏదీ శాశ్వతం కాదంటారు చాలామంది. కానీ నా వరకూ అది అబద్ధం. రెజ్లింగ్పై టేకర్ వేసిన ముద్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచుంటుంది. ఈ ఆట ముఖచిత్రాన్నే మార్చివేసిన పోరాట యోధుడు అండర్ టేకర్’’ అన్నారు. ఆ వెంటనే తనకు మాత్రమే ప్రత్యేకమైన స్టైల్లో రింగులోకి ఎంటరైన టేకర్ అభిమానుల కేరింతల మధ్య మైకందుకుని ‘‘అండర్ టేకర్కు విశ్రాంతినివ్వాల్సిన సమయమొచ్చింది’’ అన్నాడు. తన మాజీ మేనేజర్ బిల్ మూడీ హాలోగ్రామ్ ప్రదర్శించి మూడీపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా అండర్ టేకర్ ఇమేజ్ను నిర్మించడంలో మూడీది కీలకపాత్ర. ‘‘అది ఇంకెక్కడా దొరకదు’’ ‘‘మనం ఏదైనా సాధించినప్పుడు కేరింతలు, ఒవేషన్ రూపంలో ప్రేక్షకుల నుంచి తిరిగొచ్చే శక్తి ఇంకెక్కడా దొరకదు. బహుశా ఇందుకే కొందరు (‘ది రాక్’ లాంటివారు) రిటైరైన తర్వాత కూడా రీ ఎంట్రీ ఇస్తుంటారు. నా వరకు రెజ్లింగ్ అనేది అత్యుత్తమ క్రీడ. ప్రేక్షకులు ప్రత్యక్షంగా సినిమా చూస్తున్న అనుభూతికి లోనవుతారిక్కడ. ఆటగాళ్లలో ఉండే ఎమోషన్ కూడా చాలా ఎక్కువే. అదే సమయంలో కొన్ని హద్దులు దాటకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంటుంది. ఎంతో ఒత్తిడితో కూడుకున్న ఈ ఆటలో మా ప్రతిభకు తగినంత గుర్తింపు లభిస్తుందా? అని అప్పుడప్పుడూ ఆలోచిస్తుంటాను. నిజంగా ఈ 30 ఏళ్లు చాలా వేగంగా గడిచిపోయాయి.’’ - అండర్ టేకర్ (డబ్ల్యుడబ్ల్యుఈ రూపొందించిన డాక్యుమెంటరీలో..) ప్రకటన అనంతరం సోషల్ మీడియాలో స్పందించిన సహచర రెజ్లర్లు.. ‘‘తన జీవితంలో 30 ఏళ్లు డబ్ల్యుడబ్ల్యుఈ కి అంకితం చేసిన ఓ అత్యుత్తమ ఆటగాడికి వీడ్కోలు చెప్పాల్సిన సమయమొచ్చింది. తోటి ఆటగాడిగా రింగులో నాతో కొన్ని క్షణాలు పంచుకున్నందుకు థాంక్యూ టేకర్!’’ - జాన్ సీనా ‘‘30 ఏళ్ల క్రితం ఈ రోజున మా అందరిలాగే అరంగేట్రం చేశాడతను. నా కెరీర్ ప్రారంభంలో ఓ సాయంత్రం డ్రెసింగ్ రూములోకొచ్చి నన్ను ప్రోత్సహించేలా మాట్లాడిన మాటలు నేనెప్పటికీ మర్చిపోలేను. నీతో కలిసి రింగ్ పంచుకోవడం ఒక గౌరవం.’’ - ది రాక్ ‘‘మనిద్దరం ప్రతీ ఫార్మట్లో తలపడ్డాం. కొన్ని ప్రత్యేకానుభూతుల్ని సృష్టించుకున్నాం. రింగులో ఉన్నప్పుడు నువ్వొచ్చేముందు వినిపించే ఆ బెల్ శబ్దం నన్ను భయపెట్టేది. అయినా చివరిసారిగా దాన్ని వినేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా.’’ - షాన్ మైఖేల్స్ -
ఫెరారీకి ఏమైంది...
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా వన్ అంటే సగటు ఫార్ములా వన్ అభిమానికి టపీమని గుర్తొచ్చే పేరు ఫెరారీ.. ఇప్పటి వరకూ ఫార్ములా వన్లో 235 రేసులకు పైగా విజయాలతో మిగతా టీంలకు అందనంత ఎత్తున నిలిచిన ఈ ఇటాలియన్ టీం ప్రస్తుతం విజయాల కోసం ఎదురు చూస్తోంది. చివరి సారిగా 2007లో కిమిరైకోనెన్ను ప్రపంచ డ్రైవర్ చాంపియన్ను చేసిన ఫెరారీ తిరిగి మళ్లీ ఆ ఘనతను సాధించలేకపోయింది. ప్రస్తుతం జరుగుతున్న హైబ్రీడ్ ఎరాలో మెర్సిడెస్ ముందర మోకరిల్లింది. 90 ఏళ్ల రేసింగ్ చరిత్ర కలిగిన ఫెరారీ నేడు దారుణంగా విఫలమవుతుండడం సగటు ఫెరారీ అభిమానికే కాకుండా ఫార్ములా వన్తో పరిచయం ఉన్న ప్రతి వ్యక్తిని బాధించే అంశం 2019 ఫార్ములా వన్ సీజన్ మొదలై ఇప్పటికే దాదాపు రెండు నెలలు కావొస్తుంది. 5 రేసులు ముగిసే సరికి మాజీ ప్రపంచ రేసింగ్ చాంపియన్ అయిన ఫెరారీ ఒక్క రేసు కూడా గెలవకపోవడాన్ని ఫెరారీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫిబ్రవరిలో బార్సిలోనాలో జరిగిన ప్రీ సీజన్ టెస్టింగ్లో దూకుడును ప్రదర్శించిన ఫెరారీ సీజన్ ఆరంభం తరువాత మెర్సిడెస్ పేస్కు తలవంచింది. 2019 సీజన్ మొదటి గ్రాండ్ ప్రీ అయిన ఆస్ట్ర్రేలియాలో హాట్ ఫెవరెట్గా బరిలో దిగిన ఫెరారీ అంచనాలను అందుకోలేక 4, 5 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. తదుపరి జరిగిన బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ రేసులో క్వాలిఫయింగ్లో పోల్ సాధించడంతో పాటు ఫ్రంట్ రోని లాక్ చేసిన ఫెరారీ గాడిలో పడిందని అందరూ అనుకున్నారు. అయితే రేసు రోజున ఇంజన్లో తలెత్తిన సాంకేతిక లోపంతో గెలవాల్సిన రేసును ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెరిక్ మూడో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. అదే రేసులో రెండో స్థానం నుంచి మొదలు పెట్టిన మరో ఫెరారీ డ్రైవర్, మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ చేసిన చిన్న పొరపాటు వలన 5వ స్థానంతో ముగించాడు. అదే విధంగా మూడో రేసైన చైనా గ్రాండ్ ప్రీలో మెర్సిడెస్కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేక చేతులెత్తేసింది. పని చేయని అప్గ్రేడ్స్ చైనా రేసులో అంచనాలను అందుకోలేక పోయిన ఫెరారీ తదుపరి రేసు అయిన అజర్బైజాన్ గ్రాండ్ ప్రీ కోసం ఫ్రంట్ వింగ్ అప్గ్రేడ్స్తో ముందుకొచ్చింది. అయినా ఫెరారీ దురదృష్టంలో ఏ మాత్రం మార్పు రాలేదు. దీంతో స్పానిష్ గ్రాండ్ ప్రీ కోసం ఇంజన్ అప్గ్రేడ్ చేసినా ఫెరారీ అభిమానులకు మాత్రం నిరాశే మిగిలింది. డిజైన్ కాన్సెప్ట్లో తప్పుంది 2019 సీజన్ కారు అయినటువంటి ఎస్ఎఫ్-90ఎచ్ కారు డిజైన్ కాన్సెప్ట్లో తప్పుందని టీం ప్రిన్సిపల్ మాటియా బినొట్టో స్పానిష్ గ్రాండ్ ప్రీ రేసు అనంతరం వ్యాఖ్యానించారు. కార్నర్స్లో మెర్సిడెస్, రెడ్బుల్ కార్ల కంటే వేగంగా వెళ్లలేకపోతున్నామని, అయితే స్ట్నేయిట్ లైన్ స్పీడులో మా ఇంజిన్ అద్భుతంగా పని చేస్తోందని ఆయన అన్నారు. అయితే 2016 సీజన్ మాదిరే ఈ సీజన్ కూడా ఫెరారీ ఒక్క విజయం నమోదు చేయకుండానే ముగిస్తుందేమోననే ఆందోళనలో ఫెరారీ అభిమానులున్నారు. -
ఫైనల్లో పీవీ సింధుపై సైనా గెలుపు
జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజేతగా సైనా నెహ్వాల్ నిలిచారు. ఫైనల్లో పీవీ సింధుపై సైనా గెలుపొందారు. 21-18, 21-15 తేడాతో పీవీ సింధుపై సైనా విజయం సాధించారు. వరుసగా రెండో ఏడాది సింధుపై సైనా గెలిచారు. ఈ విజయంతో నాలుగోసారి జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్గా సైనా నిలిచారు. -
2032 ఒలింపిక్స్ రేసులో ఉభయ కొరియాలు
సియోల్: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ను ఉమ్మడిగా నిర్వహించేందుకు తాము సిద్ధం అంటున్నాయి దాయాది దేశాలైన ఉత్తర, దక్షిణ కొరియా. తమ రాజధానులు ప్యాంగ్యాంగ్, సియోల్లలో 2032 ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చే యోచనలో ఉన్నాయి. ఈ మేరకు శుక్రవారం స్విట్జర్లాండ్లో సమావేశం కానున్న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి సమాచారం ఇవ్వనున్నాయి. 2018లోదక్షిణ కొరియాలోని పియాంగ్చాంగ్లో జరిగిన శీతాకాల ఒలింపిక్స్కు ఉత్తర కొరియా తమ జట్లను పంపడంతో రెండు దేశాల మధ్య క్రీడా సంబంధాలు మెరుగుపడ్డాయి. మరోవైపు తమ ద్వీపకల్పంలో ఉద్రిక్తతల నివారణ, శాంతి స్థాపనకు దోహదపడుతుందని భావించి ఉమ్మడి ఆతిథ్యం పట్ల దక్షిణ కొరియా చొరవ చూపింది. గతేడాది రెండు దేశాల అంతర్గత చర్చల్లో ఆ ప్రస్తావన తెచ్చింది. గతంలో దక్షిణ కొరియా 1988లో సియో ల్లో ఒలింపిక్స్ నిర్వహించింది. ఉత్తర కొరియా వాటిని బహిష్కరించింది. అయితే, ఉత్తర కొరియా రాజకీయ, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉమ్మడి బిడ్ నెగ్గడం కష్టమే.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
ఎండుతున్న జలకళ
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement