తొలి వికెట్ కోల్పోయిన చెన్నై | Sakshi
Sakshi News home page

తొలి వికెట్ కోల్పోయిన చెన్నై

Published Sat, Apr 11 2015 4:45 PM

తొలి వికెట్ కోల్పోయిన చెన్నై

చెన్నై:ఐపీఎల్-8 లో భాగంగా ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్  75 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. చెన్నై ఓపెనర్ డ్వేన్ స్మిత్ (27 )పరుగులు చేసి తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు.  అనవసరపు పరుగుల కోసం యత్నించిన స్మిత్ రనౌట్ గా పెవిలియన్ కు చేరాడు.

 

చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొమ్మిది ఓవర్లు ముగిసే సరికి చెన్నై వికెట్ నష్టానికి 78 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. బ్రెండెన్ మెకల్లమ్(36) పరుగుతో క్రీజ్ లో ఉన్నాడు.గత మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ పై విజయంతో ధోనీ అండ్ గ్యాంగ్ మంచి ఊపు మీద ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement