కోకాకోలా ఇండియా జట్టులో ప్రణీత్ | Sakshi
Sakshi News home page

కోకాకోలా ఇండియా జట్టులో ప్రణీత్

Published Thu, Jun 12 2014 1:05 AM

coca cola india team praneeth

సాక్షి, హైదరాబాద్: కోకాకోలా ఇండియా ఎలెవన్ జట్టులో నగరానికి చెందిన ప్రణీత్ రాజ్‌కు చోటు దక్కింది. ఈ జట్టుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎం.రఫీ కూడా ఎంపికయ్యాడు. ఈ జట్టు బంగ్లాదేశ్ అండర్-17 జట్టుతో మూడు వన్డేల సిరీస్‌లో పాల్గొంటుంది. ఢిల్లీలో ఈ నెల 13 నుంచి 16 వరకు మ్యాచ్‌లు జరుగుతాయి. క్రికెట్‌లో ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు కొన్నేళ్లుగా కోకాకోలా బెవరేజెస్ సంస్థ వివిధ రాష్ట్రాల్లో క్రికెట్ టోర్నీలను నిర్వహిస్తోంది.
 
 మొదట నగరాల్లో... తదుపరి జాతీయ స్థాయిలో కోకాకోలా అండర్-16 టోర్నీ నిర్వహిస్తుంది. అయితే ఈ సారి మరో ముందడుగు వేసింది కోకాకోలా సంస్థ. టోర్నీ ఆసాంతం విశేష ప్రతిభ కనబరిచిన కుర్రాళ్లను ఇండియా ఎలెవన్ అండర్-16 జట్టుకు ఎంపిక చేసి... బంగ్లాదేశ్ జట్టుతో ఆడించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ఇండియా ఎలెవన్ జట్టుకు ఢిల్లీకి చెందిన ముకులిత్ భట్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.
 

Advertisement
Advertisement