అలవోకగా నెగ్గిన యూకీ బాంబ్రీ, రామ్కుమార్
భారత్కు 2–0 ఆధిక్యం
న్యూజిలాండ్తో డేవిస్ కప్ మ్యాచ్
ఎలాంటి సంచలనాలు చోటు చేసుకోలేదు. అంతా ఏకపక్షమే. సొంతగడ్డపై భారత టెన్నిస్ ఆటగాళ్లు మరోసారి మెరిశారు. ఫలితంగా న్యూజిలాండ్తో జరుగుతున్న డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 పోటీలో మొదటిరోజే భారత్ 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్లోనూ గెలిస్తే భారత్ విజయం ఖాయమవుతుంది.
అపుణే: పూర్తిస్థాయి ఫిట్నెస్ సంతరించుచున్న యూకీ బాంబ్రీ... అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రామ్కుమార్ రామనాథన్ డేవిస్కప్లో భారత్కు శుభారంభాన్ని ఇచ్చారు. న్యూజిలాండ్తో శుక్రవారం మొదలైన ఆసియా ఓసియానియా గ్రూప్–1 తొలి రౌండ్లో భాగంగా తొలి రోజు శుక్రవారం జరిగిన రెండు సింగిల్స్ మ్యాచ్ల్లో భారత ఆటగాళ్లు జయభేరి మోగించారు. తొలి సింగిల్స్లో యూకీ 6–4, 6–4, 6–3తో ఫిన్ టియర్నీపై గెలుపొందగా... రెండో సింగిల్స్లో రామ్కుమార్ 6–3, 6–4, 6–3తో జోస్ స్థాతమ్ను ఓడించాడు. ఈ విజయాలతో భారత్ 2–0తో ఆధిక్యాన్ని సంపాదించింది. శనివారం డబుల్స్ మ్యాచ్లో లియాండర్ పేస్–విష్ణువర్ధన్ జంట బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్లోనూ నెగ్గితే భారత్ ఏప్రిల్లో ఆసియా ఓసియానియా రెండో రౌండ్ పోటీలకు అర్హత పొందుతుంది.
ఫిన్ టియర్నీతో 3 గంటల 14 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో యూకీ ఆరంభంలో 1–3తో వెనుకబడ్డాడు. అయితే వరుసగా నాలుగు గేమ్లు గెలిచి 5–3తో ఆధిక్యంలోకి వచ్చాడు. తొమ్మిదో గేమ్లో టియర్నీ సర్వీస్ నిలబెట్టుకోగా, పదో గేమ్లో యూకీ తన సర్వీస్ను కాపాడుకొని తొలి సెట్ను దక్కించుకున్నాడు. రెండో సెట్ మొదట్లో యూకీ మళ్లీ తడబడి వెంటనే పుంజుకున్నాడు. మూడో సెట్లో టియర్నీ సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేసిన యూకీ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో యూకీ ఐదు ఏస్లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్లు చేశాడు. ప్రత్యర్థి సర్వీస్ను ఏడుసార్లు బ్రేక్ చేసి, తన సర్వీస్ను మూడుసార్లు కోల్పోయాడు.
మరోవైపు జోస్ స్థాతమ్తో గంటా 52 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో రామ్కుమార్ ఏకంగా 15 ఏస్లు సంధించాడు. అయితే సర్వీస్లో కాస్త తడబడి ఎనిమిది డబుల్ ఫాల్ట్లు చేశాడు. కానీ తన సర్వీస్లో ఒక్క బ్రేక్ పాయింట్ కూడా ఇవ్వని రామ్... ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసి తన డేవిస్ కప్ కెరీర్లో రెండో విజయాన్ని నమోదు చేసుకున్నాడు.
సింగిల్స్లో జిగేల్
Published Fri, Feb 3 2017 11:33 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
టీడీపీపై ఎన్నికల సంఘం సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement