Sakshi News home page

డివిలియర్స్దే పై చేయి !

Published Tue, Mar 24 2015 9:18 AM

de villiers will win: cricket fans

మంగళవారం జరుగుతున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్లో డివిలియర్స్ టీం న్యూజిలాండ్పై పైచేయి సాధిస్తుందని క్రికెట్ అభిమానులు తెలిపారు. మ్యాచ్ ప్రారంభమవుతుండగా న్యూజిలాండ్ కెప్టెన్ మెక్ కల్లమ్, దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏడీబీ డివిలియర్స్ లో ఎవరు పై చేయిసాధిస్థారని సాక్షి.. ఫేస్ బుక్ ద్వారా క్రికెట్ అభిమానులకు చేరువవ్వగా డివిలయర్సేనని తెలిపారు. డివిలియర్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అవుటవకుండా ఉంటే ఖచ్చితంగా సౌతాఫ్రికాను విజయంవైపు తీసుకెళతాడని తెలిపారు. ఇంకొందరు మాత్రం న్యూజిలాండ్ విజయం సాధిస్తుందని, మెక్ కల్లమ్ కూడా ఆ టీంను గెలిపించేందుకు తహతహలాడుతున్నాడని, దక్షిణాఫ్రికా ఈ రోజు గోవిందా అంటూ మరికొందరు స్పందించారు. చాలామంది మాత్రం డివిలియర్స్ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
 

Advertisement

What’s your opinion

Advertisement