సాక్షి, విజయవాడ: సీనియర్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ (129 బంతుల్లో 95; 9 ఫోర్లు, ఒక సిక్స్) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీ జట్టును రంజీ ట్రోఫీలో సెమీఫైనల్కు చేర్చాడు. మధ్యప్రదేశ్తో సోమవారం ముగిసిన ఐదు రోజుల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 217 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 51.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అధిగమించింది. ఓపెనర్ కునాల్ చండేలా (57; 6 ఫోర్లు, 2 సిక్స్లు)తో గంభీర్ రెండో వికెట్కు 98 పరుగులు... ధ్రువ్ (46 నాటౌట్; 6 ఫోర్లు)తో కలిసి మూడో వికెట్కు 95 పరుగులు జోడించాడు. 2009–2010 సీజన్ తర్వాత ఢిల్లీ జట్టు రంజీ ట్రోఫీలో సెమీస్కు చేరడం ఇదే తొలిసారి.
గుజరాత్ ఇంటిముఖం...
డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్, బెంగాల్ జట్ల మధ్య జైపూర్లో జరిగిన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా బెంగాల్ జట్టు సెమీస్ చేరింది. చివరి రోజు ఓవర్నైట్ స్కోరు 483/4తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బెంగాల్ మ్యాచ్ ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 695 పరుగులు చేసింది.
తొలిసారి విదర్భ...
కేరళతో సూరత్లో జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో విదర్భ జట్టు 412 పరుగుల ఆధిక్యంతో గెలిచి తొలిసారి రంజీ ట్రోఫీలో సెమీఫైనల్కు చేరింది. 578 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కేరళ రెండో ఇన్నింగ్స్లో 165 పరుగులకు ఆలౌటైంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆదిత్య సర్వాతే (6/41) విదర్భ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 431/6తో బ్యాటింగ్ కొనసాగించిన విదర్భ జట్టు తొమ్మిది వికెట్లకు 507 పరుగులవద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఈనెల 17న మొదలయ్యే సెమీఫైనల్ మ్యాచ్ల్లో కర్ణాటకతో విదర్భ; బెంగాల్తో ఢిల్లీ తలపడతాయి.
రంజీ ట్రోఫీ సెమీస్లో ఢిల్లీ
Published Tue, Dec 12 2017 12:59 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Lok sabha elections 2024: బారామతి నుంచి మెయిన్పురి దాకా...హోరాహోరీ
బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే..: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement