దేవేంద్రో పసిడి పంచ్ | Sakshi
Sakshi News home page

దేవేంద్రో పసిడి పంచ్

Published Mon, Feb 10 2014 1:21 AM

devendro singh Won the gold medal

న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై భారత బాక్సర్లు మరోసారి సత్తా చాటుకున్నారు. హంగేరిలో జరిగిన బోస్కాయ్ ఇన్విటేషన్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు మొత్తం నాలుగు పతకాలు నెగ్గారు.

 
 ఒలింపియన్ దేవేంద్రో సింగ్  49 కేజీల విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో ఈ మణిపూర్ బాక్సర్ 3-0తో సోమర్ట్ ఎర్సాన్ (కజకిస్థాన్)పై విజయం సాధించాడు. 64 కేజీల విభాగం ఫైనల్లో మనోజ్ కుమార్ 0-3తో సింబర్‌జనోవ్ (కజకిస్థాన్) చేతిలో ఓడిపోయి రజతంతో సంతృప్తి పడ్డాడు.
 

Advertisement
Advertisement