మరోసారి మెరిసిన శ్రేయస్‌ | Sakshi
Sakshi News home page

మరోసారి మెరిసిన శ్రేయస్‌

Published Sun, Dec 17 2017 6:50 PM

Dhawan, Iyer put India on course after early wicket - Sakshi

విశాఖ:శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేల సిరీస్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ మరోసారి మెరిశాడు. రెండో వన్డేలో హాఫ్‌ సెంచరీ సాధించిన అయ్యర్‌.. మూడో వన్డేలో సైతం అర్థ శతకం సాధించాడు. 44 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. శ్రీలంక నిర్దేశించిన 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(7) ఆదిలోనే పెవిలియన్‌కు చేరాడు. ఆ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌.. మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ను ముందుకు తీసుకెళ్లాడు. ఒకవైపు ధావన్‌ కుదరుగా బ్యాటింగ్‌ చేస్తే, అయ్యర్‌ మాత్రం దూకుడును కొనసాగించాడు. ఈ క్రమంలోనే వరుసగా రెండో హాఫ్‌ సెంచరీని అయ్యర్‌ సాధించాడు.


 

Advertisement
Advertisement