బంగ్లాతో తొలి టెస్టు; భారత్ 239/0 | Sakshi
Sakshi News home page

బంగ్లాతో తొలి టెస్టు; భారత్ 239/0

Published Wed, Jun 10 2015 6:02 PM

బంగ్లాతో తొలి టెస్టు; భారత్ 239/0

ఫతుల్లా: బంగ్లాదేశ్ తో బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో భారత్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి 56 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 239 పరుగులు చేసింది. వెలుతురు మందగించడంతో ఆటను నిర్ణీత సమయానికన్నా ముందే ముగించారు.

అంతకుముందు వర్షం ఆటంకం కలిగించడంతో దాదాపు మూడు గంటల సేపు ఆట ఆగిపోయింది. వర్షం తగ్గడంతో ఆట తిరిగి కొనసాగించారు. ఓపెనర్లు శిఖర్ ధావన్, మురళీ విజయ్ శుభారంభం అందించారు. ధావన్ సెంచరీ, విజయ్ అర్ధ సెంచరీ చేశారు. ధావన్ 150, విజయ్ 89 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

Advertisement
Advertisement