యోగ్రాజ్ సింగ్ ఆరోపణ
న్యూఢిల్లీ: యువరాజ్ సింగ్కు భారత ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కకపోవడానికి కెప్టెన్ ధోనియే కారణమని... యువీ తండ్రి, మాజీ క్రికెటర్ యోగ్రాజ్ సింగ్ ఆరోపించారు. ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో యువీకి రికార్డు స్థాయిలో రూ.16 కోట్లు పలికిన అనంతరం ఆయన తన మనసులోని మాటను వెళ్లగక్కారు. ‘ప్రపంచకప్ జట్టులో యువీ లేడనే విషయం తెలిసి నేను షాక్కు గురయ్యాను. యువీ అవసరం జట్టుకు లేదని సెలక్టర్లకు ధోని చెప్పాడు.
ఒకవేళ ధోనికి మా అబ్బాయితో వ్యక్తిగత విరోధముంటే నేనేమీ చేయలేను. భగవంతుడే తగిన న్యాయం చేస్తాడు. తాత్కాలికంగా కష్టకాలంలో ఉన్న సీనియర్లను అతడు ప్రోత్సహించాలి. గత 15 ఏళ్లుగా జట్టుకోసం యువీ ఎంతో కష్టపడ్డాడు. భారత్కు 90 శాతం విజయాలు అందించాడు. ఓవైపు క్యాన్సర్తో బాధపడుతున్నా దేశానికి 28 ఏళ్ల అనంతరం ప్రపంచకప్ను అందించాడు. ఒకవేళ తాను ఈ వ్యాధితో మరణించినా దేశం కోసం ఆడాలనే తపన చెరిగిపోదని అన్నాడు. అందుకే ఏమైనా సరే అని టోర్నీలో ఆడాడు. అలాంటి ఆటగాడికి ఇప్పుడిలాంటి సత్కారం జరిగింది’ అని యోగ్రాజ్ ఆవేదనగా అన్నారు.
తల్లిదండ్రులకు హితవు
మరోవైపు ఈ విషయంలో కెప్టెన్ ధోనికి, అతడి తల్లిదండ్రులకు కూడా యోగ్రాజ్ హితవు చెప్పారు. ‘ధోనికి నేనో సంగతి చెబుదామనుకుంటున్నాను. నిజమైన విద్య, విలువలు అనేవి తోటి దేశస్థుడు కిందపడితే సహాయం చేయాలనే జ్ఞానాన్ని బోధిస్తాయి. అతడు నడవగలిగే పరిస్థితి లేకపోతే తన భుజాల మీద ఎత్తుకుని ముందుకు తీసుకెళ్లాలి. అలాగే ధోని తల్లిదండ్రులకు కూడా ఓ విషయం చెప్పదలుచుకున్నాను. రేపు యువరాజ్, ధోని ఆడకపోవచ్చు. కానీ అతడు యువీకి ఎలాంటి నష్టం చేశాడో జీవితాంతం గుర్తుండిపోతుంది. నేను, యువీ... ధోనికి శత్రువులం కాదు. దేవుడే తగిన శాస్తి చేస్తాడు’ అని యోగ్రాజ్ తీవ్రంగా స్పందించారు.
తోసిపుచ్చిన యువీ
అయితే ఈ వివాదానికి యువరాజ్ సింగ్ ముగింపు పలికే ప్రయత్నం చేశాడు. ‘అందరి తల్లిదండ్రుల్లాగే మా నాన్న కూడా నన్ను ప్రపంచకప్ జట్టులో చూడాలనుకున్నారు. ధోని కెప్టెన్సీలో ఆడటాన్ని నేను ఆస్వాదించాను. భవిష్యత్లో కూడా ఇది కొనసాగుతుంది’ అని యువీ ట్వీట్ చేశాడు.
ధోని వల్లే యువీకి చోటు దక్కలేదు
Published Tue, Feb 17 2015 1:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement