మనీశ్‌ పాండే స్థానంలో దినేశ్‌ కార్తీక్‌ | Sakshi
Sakshi News home page

మనీశ్‌ పాండే స్థానంలో దినేశ్‌ కార్తీక్‌

Published Fri, May 19 2017 1:09 AM

మనీశ్‌ పాండే స్థానంలో దినేశ్‌ కార్తీక్‌

చాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టులో ఒక మార్పు జరిగింది. ఐపీఎల్‌లో గాయపడిన మనీశ్‌ పాండే స్థానంలో వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. భారత్‌ తరఫున కార్తీక్‌ ఆఖరిసారిగా 2014 మార్చిలో వన్డే ఆడాడు.

2016–17 సీజన్‌లో దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో కార్తీక్‌ 9 మ్యాచ్‌లలో 2 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలు సహా 607 పరుగులతో టోర్నీ టాప్‌ స్కోరర్‌గా నిలిచి తమిళనాడు టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇదే కారణంగా అతనికి వన్డేల్లో మళ్లీ చోటు దక్కింది. 

Advertisement
Advertisement