ముకుంద్, ఛటర్జీ సెంచరీలు | Sakshi
Sakshi News home page

ముకుంద్, ఛటర్జీ సెంచరీలు

Published Thu, Aug 25 2016 12:12 AM

Duleep Trophy match

ఇండియా రెడ్ 344/3
దులీప్ ట్రోఫీ మ్యాచ్


గ్రేటర్ నోయిడా: దులీప్ ట్రోఫీ ‘పింక్‌బాల్’ మ్యాచ్‌లో రెండో రోజు పరుగుల వరద పారింది. బుధవారం ఆట ముగిసే సమయానికి ఇండియా రెడ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. అభినవ్ ముకుంద్ (212 బంతుల్లో 162 బ్యాటింగ్; 19 ఫోర్లు), సుదీప్ ఛటర్జీ (182 బంతుల్లో 114; 14 ఫోర్లు) శతకాలతో చెలరేగారు.


వీరిద్దరు రెండో వికెట్‌కు 240 పరుగులు జోడించగా, యువరాజ్ (10) మళ్లీ విఫలమయ్యాడు. అంతకు ముందు 116/7 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించిన ఇండియా గ్రీన్ తొలి ఇన్నింగ్స్‌లో 151 పరుగులకు ఆలౌటైంది.

 

Advertisement
Advertisement