టీమిండియాకు భారీ లక్ష్యం | Sakshi
Sakshi News home page

టీమిండియాకు భారీ లక్ష్యం

Published Sun, Nov 13 2016 1:02 PM

టీమిండియాకు భారీ లక్ష్యం

రాజ్కోట్:భారత్ తో జరుగుతున్న  తొలి టెస్టులో ఇంగ్లండ్ 310 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఆదివారం చివరి రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్ ను 260/3 వద్ద డిక్లేర్ చేసింది. దాంతో ఇంగ్లండ్ కు 309 పరుగుల ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 49 పరుగుల ఆధిక్యం సాధించిన సంగతి తెలిసిందే.  114/0 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ తొలి సెషన్ లో రెండు వికెట్లను కోల్పోయింది.

ఓపెనర్ హసీబ్ హమీద్(82)ను తొలి వికెట్ గా కోల్పోయిన ఇంగ్లండ్.. ఆ తరువా జో రూట్(4)వికెట్ ను నష్టపోయింది. ఆ తరువాత బెన్ స్టోక్స్ (29 నాటౌట్)తో కలిసి కుక్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే కుక్(130) సెంచరీ సాధించాడు. అయితే  కుక్ అవుటైన అనంతరం ఇంగ్లండ్ తన ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.

 

Advertisement
Advertisement