ఇంగ్లండ్, శ్రీలంక వన్డే టై | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్, శ్రీలంక వన్డే టై

Published Thu, Jun 23 2016 12:28 AM

ఇంగ్లండ్, శ్రీలంక వన్డే టై

నాటింగ్‌హమ్: ఆఖరి బంతికి ప్లంకెట్ సిక్సర్ కొట్టడంతో శ్రీలంకతో తొలి వన్డేను ఇంగ్లండ్ టై చేసుకోగలిగింది. మంగళవారం ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో జరిగిన ఈ డేనైట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమి అంచుల నుంచి కోలుకుని టై చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 286 పరుగులు చేసింది. కెప్టెన్ మాథ్యూస్ (109 బంతుల్లో 73; 5 ఫోర్లు), ప్రసన్న (28 బంతుల్లో 59; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు.

ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్, విల్లీ, ప్లంకెట్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తర్వాత ఇంగ్లండ్ కూడా 50 ఓవర్లలో 8 వికెట్లకు 286 పరుగులు చేసింది. ఒక దశలో 82 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టును బట్లర్ (99 బంతుల్లో 93; 6 ఫోర్లు, 1 సిక్సర్), వోక్స్ (92 బంతుల్లో 95 నాటౌట్; 4 ఫోర్లు) ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కు 136 పరుగులు జోడించారు. చివర్లో ప్లంకెట్ (11బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్సర్) వేగంగా ఆడటంతో పాటు ఆఖరి బంతికి సిక్సర్ కొట్టి మ్యాచ్‌ను ైటె  చేశాడు. ఐదు వన్డేల సిరీస్‌లో రెండో మ్యాచ్ 24న జరుగుతుంది.
 

Advertisement
Advertisement