Sakshi News home page

ఇంగ్లండ్‌తో తొలి టెస్టు: పుజారా, కుల్దీప్‌ ఔట్‌

Published Wed, Aug 1 2018 4:09 PM

England Win The Toss And Elect To Bat In 1st Test Against India - Sakshi

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌తో సుదీర్ఘ టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు స్థానిక ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ సారిథి జోయ్‌ రూట్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. మ్యాచ్‌కు ముందు రోజే తుది జట్టును ప్రకటించించిన ఇంగ్లండ్‌ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. మరోవైపు వన్డే, టీ20ల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన లోకేశ్‌ రాహుల్‌వైపే టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి మొగ్గు చూపాడు. దీంతో రాహుల్‌ కోసం పరుగుల యంత్రం పుజారాను తుది జట్టు నుంచి తప్పించారు.

టీమిండియా సారథి దక్షిణాఫ్రికా సిరీస్‌లో లాగా ఎలాంటి ప్రయోగాలు జోలికి వెళ్లకుండా వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానేకు తుది జట్టులో అవకాశం కల్పించాడు. మణికట్టు మాయాజాలంతో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెను ముప్పుతిప్పలు పెట్టిన కుల్దీప్‌పై కాకుండా సీనియర్‌ స్పిన్నర్‌ రవించంద్రన్‌ అశ్విన్‌పైనే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నమ్మకం ఉంచింది. ఎడ్జ్‌బాస్టన్‌ పిచ్‌ ఆరంభంలో పేస్, స్వింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో ముగ్గురు రెగ్యులర్‌ పేసర్లతో టీమిండియా బరిలోకి దిగింది. దీంతో చాలా కాలం తర్వాత మీడియం పేసర్‌ మహ్మద్‌ షమీకి తుది జట్టులో చోటు దక్కింది. తొలి టెస్టులో గెలిచి సిరీస్‌ను ఘనంగా ఆరంభించాలని టీమిండియా భావిస్తుండగా..  మరోవైపు ఆడుతున్న 1000వ టెస్టు మ్యాచ్‌లో తప్పకుండా గెలవాలని ఇంగ్లండ్‌ పట్టుదలగా ఉంది. 

Advertisement
Advertisement