ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ | Sakshi
Sakshi News home page

ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

Published Wed, Mar 30 2016 6:44 PM

england won the toss and elected to field first against new zealand in semis of world twenty 20

ఢిల్లీ:వరల్డ్ టీ 20లో భాగంగా బుధవారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో వరుస విజయాలు సాధించి న్యూజిలాండ్ మంచి ఊపు మీద ఉండగా, మరోవైపు తడబడుతూ ఇంగ్లండ్ సెమీస్ కు చేరింది.పొట్టి ఫార్మాట్ లో  ఒకసారి వరల్డ్ కప్ ను గెలిచిన ఇంగ్లండ్ మరొకసారి తుదిపోరుకు అర్హత సాధించాలని భావిస్తుండగా, న్యూజిలాండ్ మాత్రం తొలిసారి ఫైనల్ కు చేరాలని పట్టుదలగా ఉంది.  దీంతో ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది.

ఇప్పటివరకూ ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ల మధ్య  13 టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఇంగ్లండ్ 8 గెలిచి, నాలుగు ఓడింది. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ప్రపంచకప్‌లలో మాత్రం నాలుగు మ్యాచ్‌లు జరిగితే చెరో రెండు గెలిచాయి.

Advertisement
Advertisement