Sakshi News home page

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

Published Sun, Feb 1 2015 8:40 AM

england won the toss and opted to field

పెర్త్: ముక్కోణపు టోర్నీ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓ వైపు భీకరమైన ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా క్రికెటర్లు... మరోవైపు రెండుసార్లు భారత్‌ను ఓడించిన ఉత్సాహంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు... ముక్కోణపు వన్డే టోర్నీ ఫైనల్‌కు సిద్ధమయ్యారు.

వాకా మైదానంలో ఆదివారం జరిగే ఈ మ్యాచ్... ప్రపంచకప్‌కు ముందు ఈ రెండు జట్లకు అసలైన పరీక్ష. టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఆస్ట్రేలియా... అన్ని విభాగాల్లోనూ సమతూకంతో కనిపిస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ రెండు సార్లు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను నియంత్రించలేకపోయింది. ఇరు జట్లలోని ప్రధాన ఆటగాళ్లంతా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నారు.
 

Advertisement
Advertisement