దేశవాళీ క్రికెట్ పై గంభీర్ దృష్టి | Sakshi
Sakshi News home page

దేశవాళీ క్రికెట్ పై గంభీర్ దృష్టి

Published Mon, Oct 6 2014 3:34 PM

దేశవాళీ క్రికెట్ పై గంభీర్ దృష్టి

న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన భారత ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఇప్పుడు దేశవాళీ సీజన్  పై దృష్టిపెట్టాడు. జాతీయ జట్టులో తిరిగి స్థానం సంపాదించేందుకు త్వరలో జరగనున్న దేశవాళీ టోర్నిలో సత్తా చాటాలని గౌతీ భావిస్తున్నాడు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత టెస్టు జట్టులో చోటు సంపాదించినా నిలదొక్కుకోలేకపోయాడు.

ఇంగ్లండ్ తో ఆడిన చివరి రెండు టెస్టుల్లో  0, 3, 4, 18 పరుగులు మాత్రమే సాధించాడు. మళ్లీ ఫామ్ లోకి వస్తే జాతీయ జట్టులో చోటు దక్కించుకోవచ్చని అతడు భావిస్తున్నాడు. ఇటీవల ముగిసిన చాంపియన్స్ లీగ్ లో గంభీర్ బాగానే రాణించాడు.

Advertisement
Advertisement