అభిషేక్‌కు స్వర్ణం | Sakshi
Sakshi News home page

అభిషేక్‌కు స్వర్ణం

Published Sun, Aug 16 2015 12:41 AM

అభిషేక్‌కు స్వర్ణం

వ్రోక్లా (పోలండ్) : ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-3 టోర్నమెం ట్‌లో భారత ఆర్చర్ అభిషేక్ వర్మ స్వర్ణ పతకాన్ని సాధించాడు. శనివారం జరిగిన పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో అభిషేక్ 148-145 పాయింట్ల తేడాతో ఇస్మాయిల్ ఇబాది (ఇరాన్)పై గెలిచాడు. అయితే కాం పౌండ్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు నిరాశ మిగిలింది. కాం స్య పతక పోరులో అభిషేక్, కవల్‌ప్రీత్, రజత్ చౌహాన్‌లతో కూడిన భారత్ 230-233 తేడాతో ఇటలీ చేతిలో ఓడింది.

Advertisement
Advertisement