పైచేయి ఎవరిదో ! | Sakshi
Sakshi News home page

పైచేయి ఎవరిదో!

Published Thu, May 19 2016 7:50 PM

పైచేయి ఎవరిదో ! - Sakshi

కాన్పూర్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో మరో ఆసక్తికర సమరానికి తెరలేచింది. కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో గురువారం గుజరాత్ లయన్స్-కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది. ఈ మ్యాచ్లో పైచేయి సాధించిన జట్టు ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకుంటుంది. దీంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ లయన్స్ తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో గుజరాత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

 

ఇదిలాఉండగా ఇప్పటివరకూ ఇరు జట్లు 12 మ్యాచ్లాడి తలో ఏడు మ్యాచ్ల్లో విజయం సాధించాయి. ప్రస్తుతం 14 పాయిం ట్లతో ఉన్న కోల్ కతా రన్ రేట్ కూడా బాగానే ఉంది. ఈ మ్యాచ్ గెలిచి, మరో మ్యాచ్ లో కూడా విజయం సాధిస్తే కోల్ కతాకు ఎలాంటి గొడవా లేదు. వరుస రెండు మ్యాచ్‌లూ ఓడితే 14 పాయింట్లతో కోల్ కతా ముందుకు వెళ్లడం కష్టం. మరోవైపు గుజరాత్ పరి స్థితి కూడా అంతంమాత్రంగానే ఉంది. కాబట్టి ఈ రోజు జరిగే మ్యాచ్‌లో గెలిస్తే మాత్రం ఊపిరి పీల్చుకోవచ్చు.  ఒకవేళ కోల్‌కతాతో ఓడితే ముంబైపై కచ్చితంగా గెలవాలి. ఒకవేళ రెండు మ్యాచ్‌లు ఓడితే మాత్రం 14 పాయింట్లతో ఉన్నా ఏ రకమైన సమీకరణంలో అయినా ముందుకు పోవడం కష్టం కావచ్చు. ఎందుకంటే రేసులో ఉన్న ఆరు జట్లలో అత్యంత దారుణంగా గుజరాత్ రన్ రేట్ ఉండటం గమనార్హం.


కోల్ కతా తుది జట్టు:  గౌతం గంభీర్(కెప్టెన్), రాబిన్ ఉతప్ప,మనీష్ పాండే, యూసఫ్ పఠాన్, షకిబుల్ హసన్,సూర్య కుమార్ యాదవ్, జాసన్ హోల్డర్,పీయూష్ చావ్లా,సునీల్ నరైన్,మోర్నీ మోర్కెల్,రాజ్ పుత్


గుజరాత్ లయన్స్ తుదిజట్టు: సురేష్ రైనా(కెప్టెన్),డ్వేన్ స్మిత్, బ్రెండన్ మెకల్లమ్,దినేష్ కార్తీక్,అరోన్ ఫించ్,రవీంద్ర జడేజా,ద్వివేది, ప్రవీణ్ కుమార్,జకాతి, ధావల్ కులకర్ణి

 

Advertisement
Advertisement