గుజరాత్ ఫీల్డింగ్.. ఆర్సీబీ బ్యాటింగ్ | Sakshi
Sakshi News home page

గుజరాత్ ఫీల్డింగ్.. ఆర్సీబీ బ్యాటింగ్

Published Tue, Apr 18 2017 7:48 PM

gujarat won the toss and elected to field first

రాజ్కోట్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఒకే మార్పుతో బరిలోకి దిగుతుంది. ఆర్సీబీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ గాయం కారణంగా మ్యాచ్ కు దూరమయ్యాడు. అతని స్థానంలో క్రిస్ గేల్ తుది జట్టులోకి వచ్చాడు. మరొకవైపు గుజరాత్ కూడా ఒక మార్పుతోనే పోరుకు సిద్ధమైంది. గత మ్యాచ్ కు దూరమైన అరోన్ ఫించ్ తుది జట్టులోకి రాగా, జాసన్ రాయ్ కు విశ్రాంతినిచ్చారు.

ఆర్సీబీ తుది జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), క్రిస్ గేల్, షేన్ వాట్సన్, మన్ దీప్ సింగ్, ట్రావిస్ హెడ్, కేదర్ జాదవ్, స్టువర్ట్ బిన్నీ, మిల్నీ,ఎస్ అరవింద్, చాహల్, పవన్ నేగీ

గుజరాత్ తుది జట్టు: సురేశ్ రైనా(కెప్టెన్), బ్రెండన్ మెకల్లమ్, డ్వేన్ స్మిత్, అరోన్ ఫించ్,దినేశ్ కార్తీక్, ఇషాన్ కిషాన్, రవీంద్ర జడేజా, ధావల్ కులకర్ణి, బాసిల్ థంపి, ఆండ్రూ టై, శివిల్ కౌశిక్

Advertisement
Advertisement