బ్రావోకు జరిమానా | Sakshi
Sakshi News home page

బ్రావోకు జరిమానా

Published Sun, May 22 2016 6:14 PM

బ్రావోకు జరిమానా - Sakshi

కాన్పూర్: గుజరాత్ లయన్స్ ఆల్-రౌండర్ డ్వేన్ బ్రావోకు జరిమానా పడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నిబంధనలు ఉల్లఘించినందుకు అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. ముంబై ఇండియన్స్ తో కాన్పూర్ లో శనివారం జరిగిన మ్యాచ్ లో అతడు నిబంధనలు ఉల్లఘించినట్టు రుజువు కావడంతో మ్యాచ్ రిఫరీ జరిమానా విధించినట్టు ఐపీఎల్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది.

మ్యాచ్ సందర్భంగా ముంబై ఆటగాడు కీరన్‌ పొలార్డ్ తో బ్రావో గొడవ పడ్డాడు. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై గుజరాత్ లయన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఐపీఎల్-9 గంభీర్, కోహ్లి సహా పలువురు ఆటగాళ్లు జరిమానాకు గురైయ్యారు.

Advertisement
Advertisement