ఐసీసీ ప్రపంచ ఎలెవన్‌లో పాండ్యా, కార్తీక్‌ | Sakshi
Sakshi News home page

ఐసీసీ ప్రపంచ ఎలెవన్‌లో పాండ్యా, కార్తీక్‌

Published Fri, May 4 2018 5:23 AM

Hardik Pandya, Dinesh Karthik to Play for ICC World XI Against West Indies - Sakshi

దుబాయ్‌: ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌లు ఐసీసీ ప్రపంచ ఎలెవన్‌ జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. ఈ జట్టు ఈ నెల 31న లార్డ్స్‌లో వెస్టిండీస్‌తో జరిగే టి20 మ్యాచ్‌లో తలపడుతుంది. గతేడాది హరికేన్‌ బీభత్సంతో కరీబియన్‌ స్టేడియాలకు తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లింది.

ధ్వంసమైన స్టేడియాలను నవీకరించడానికి నిధుల సేకరణ కోసం ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. ప్రతి దేశం నుంచి ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో పాల్గొంటున్నారు. ఈ టి20కి ఐసీసీ ఇదివరకే అంతర్జాతీయ హోదా ఇచ్చింది. పాక్‌ తరఫున అఫ్రిది, షోయబ్‌ మాలిక్, బంగ్లాదేశ్‌ నుంచి షకీబుల్‌ హసన్, తమీమ్‌ ఇక్బాల్, లంక నుంచి తిసార పెరీరా, అఫ్గానిస్తాన్‌ నుంచి రషీద్‌ ఖాన్‌ ఎంపికయ్యారు.

Advertisement
Advertisement