* పోలండ్పై 3-0తో గెలుపు
* హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్
యాంట్వర్ప్ (బెల్జియం): తొలి మ్యాచ్లో అతికష్టమ్మీద గెలిచిన భారత పురుషుల హాకీ జట్టు రెండో మ్యాచ్లో మెరుగైన ఆటతీరును కనబరిచింది. ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా ఆద్యంతం దూకుడుగా ఆడింది. హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని తమ ఖాతాలో జమచేసుకుంది. పోలండ్తో మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్లో భారత్ 3-0 గోల్స్ తేడాతో గెలిచింది.
టీమిండియాకు యువరాజ్ వాల్మీకి (23వ నిమిషంలో), కెప్టెన్ సర్దార్ సింగ్ (42వ నిమిషంలో), దేవేందర్ వాల్మీకి (52వ నిమిషంలో) ఒక్కో గోల్ను అందించారు. ఈ మూడూ ఫీల్డ్ గోల్స్ కావడం విశేషం. భారత్కు లభించిన నాలుగు పెనాల్టీ కార్నర్లు వృథా అయ్యాయి. లేదంటే సర్దార్ సింగ్ బృందం మరింత ఆధిక్యంతో గెలిచేది. ఫ్రాన్స్తో జరిగిన తొలి మ్యాచ్లో రక్షణపంక్తిలో కనిపించిన లోపాలను సరిచేసుకున్న భారత్ ఈ మ్యాచ్లో పూర్తి ఆధిపత్యం చలాయించింది. తొలి క్వార్టర్లో గోల్ చేయలేకపోయిన భారత్ ఆ తర్వాత మూడు క్వార్టర్స్లో ఒక్కో గోల్ సాధించింది. ప్రస్తుతం భారత్ ఆరు పాయింట్లతో గ్రూప్ ‘ఎ’లో అగ్రస్థానంలో ఉంది. శుక్రవారం జరిగే తదుపరి లీగ్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో భారత్ తలపడుతుంది.
మహిళల జట్టుకు భారీ ఓటమి
ఇదే టోర్నీ మహిళల విభాగంలో భారత జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. న్యూజిలాండ్తో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్లో భారత్ 0-5 గోల్స్ తేడాతో ఓడిపోయింది. కివీస్ తరఫున జెమ్మా ఫ్లిన్, కిర్స్టెన్ పియర్స్ రెండేసి గోల్స్ చేయగా... ఒలివియా మెర్రీ ఒక గోల్ సాధించింది. ఈ మ్యాచ్ ద్వారా భారత క్రీడాకారిణి సుశీలా చాను (మణిపూర్) తన కెరీర్లో 100 మ్యాచ్లు పూర్తి చేసుకుంది. బుధవారం జరిగే తదుపరి లీగ్ మ్యాచ్లో పోలండ్తో భారత్ ఆడుతుంది.
భారత్ ‘తీన్మార్’
Published Wed, Jun 24 2015 12:07 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement