సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్–3)లో హైదరాబాద్ హంటర్స్ తమ చివరి మ్యాచ్లో బెంగళూరు బ్లాస్టర్స్ను తుడిచిపెట్టేసింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన పోరులో హంటర్స్ 6–(–1) తో బెంగళూరుపై ఘనవిజయం సాధించింది. తొలి మ్యాచ్గా జరిగిన మిక్స్డ్ డబుల్స్లో పియా జెబదియా – సాత్విక్ సాయిరాజ్ (హైదరాబాద్) జోడి 15–6, 14–15, 15–9తో సిక్కి రెడ్డి– మను అత్రి (బెంగళూరు)జంటపై గెలిచి హంటర్స్కు శుభారంభాన్నిచ్చింది. పురుషుల సింగిల్స్లో సాయిప్రణీత్ 10–15, 15–7, 15–14తో చోంగ్ వీ ఫెంగ్ (బెంగళూరు)పై, మహిళల సింగిల్స్లో కరోలినా మారిన్ 15–9, 15–7తో కిర్స్టీ గిల్మోర్ (బెంగళూరు)పై గెలుపొందారు.
తర్వాత జరిగిన రెండో పురుషుల సింగిల్స్ ‘ట్రంప్’ మ్యాచ్లో లీ హ్యూన్ ఇల్ 15–11, 11–15, 15–11తో శుభాంకర్ డే (బెంగళూరు)పై విజయం సాధించడంతో మరో మ్యాచ్ ఉండగానే హైదరాబాద్ 5–0తో జయభేరి మోగించింది. చివరగా జరిగిన పురుషుల డబుల్స్ బెంగళూరుకు ‘ట్రంప్’ కాగా... మార్కిస్ కిడో–సియాంగ్ (హైదరాబాద్) జోడి 15–10, 11–15, 15–7తో కిమ్ స రంగ్–మథియాస్ బోయె (బెంగళూరు) జంటపై గెలిచింది. నేటి రాత్రి 7 గంటలకు జరిగే సెమీస్లో ఢిల్లీతో హైదరాబాద్ తలపడుతుంది.
హైదరాబాద్ సెమీస్ ప్రత్యర్థి ఢిల్లీ
Published Fri, Jan 12 2018 12:50 AM
Related news
-
టెన్త్లో మళ్లీ నిర్మల్ టాప్.. అమ్మాయిలదే హవా
సాక్షి, హైదరాబాద్: ఇంటర్లో మాదిరిగానే టెన్త్ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. రెగ్యులర్ విభాగంలో బాలురు కన్నా 3.81 శాతం, ప్రైవేటు (కంపార్ట్మెంటల్) విభాగంలో 6.74 శాతం ఎక్కువ ఉత్తీర్ణతను నమోదు చేశారు. మొత్తంగా ఈ ఏడాది రెగ్యులర్ విద్యార్థులు 91.31 శాతం, ప్రైవేటు విద్యార్థులు 49.73 శాతం పాసయ్యారు. నిర్మల్ జిల్లా 99.05 శాతం ఉత్తీర్ణతతో గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. వికారాబాద్ జిల్లా 65.10 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉంది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకూ జరిగిన పదవ తరగతి పరీక్షా ఫలితాలను పాఠశాల విద్య కమిషనర్ దేవసేన, రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మంగళవారం హైదరాబాద్లో వెల్లడించారు. 5,05,813 మంది పరీక్షలు రాస్తే 4,57,044 మంది ఉత్తీర్ణత సాధించినట్టు వారు తెలిపారు. రెగ్యులర్గా రాసిన వారిలో బాలికలు 2,28,616 (93.23%), బాలురు 2,22,656 (89.42%) మంది పాసయ్యారు. ప్రైవేటులో బాలికలు 2,178 (54.14%) మంది, బాలురు 3,594 (47.40%) మంది పాసయ్యారు. ఆరు స్కూళ్లలో సున్నా ఉత్తీర్ణత గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. 3,927 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఆరు స్కూళ్ళలో ఒక్కరు కూడా పాసవ్వలేదు. గురుకుల పాఠశాలలు 98.71 శాతం అత్యధిక పాస్ పర్సంటేజీతో దూసుకెళ్ళాయి. జిల్లా పరిషత్, ఇతర ప్రభుత్వ పాఠశాలలు సగటు ఉత్తీర్ణత శాతం కన్నా తక్కువ పర్సంటేజీ దక్కించుకున్నాయి. 15 రోజుల్లోగా రీ కౌంటింగ్, వెరిఫికేషన్ మార్కుల రీ కౌంటింగ్, ఫలితాల రీ వెరిఫికేషన్ కోరుకునేవారు 15 రోజుల్లో (మే 15లోగా) దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ తెలిపింది. రీ కౌంటింగ్కు సబ్జెక్టుకు రూ.500 చెల్లించి, దరఖాస్తులను పాఠశాల విద్య కార్యాలయానికి పంపాలి. రీ వెరిఫికేషన్కు సబ్జెక్టుకు రూ. 1,000 చెల్లించాలి. హాల్ టిక్కెట్ జిరాక్స్, మార్కుల మెమో కాపీతో కూడిన రీ వెరిఫికేషన్ దరఖాస్తును సంబంధిత డీఈవో కార్యాలయానికి పంపాలి. వీరికి మూల్యాంకనం చేసిన సమాధాన పత్రం ప్రతిని పంపుతారు. జూన్ 3 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 3 నుంచి 13 వరకూ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం ఎదురు చూడకుండా ఈ పరీక్షలకు దరఖాస్తు చేయాలని విద్యాశాఖ కోరింది. మే 16లోగా సంబంధిత స్కూల్ హెచ్ఎంలకు పరీక్ష ఫీజు చెల్లించాలి. ఒత్తిడికి లోనవ్వొద్దు : బుర్రా వెంకటేశం ఫెయిల్ అయిన, గ్రేడ్లు తగ్గిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి గురికావద్దంటూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విజ్ఞప్తి చేశారు. ఫెయిల్ అయిన వారు సప్లిమెంటరీ రాసుకుని ఇంటర్లో చేరేందుకు అవకాశం ఉందన్నారు. అన్ని పరీక్షలు ఫెయిల్ అయినా, జీవితంలో అద్భుతంగా రాణించిన వారు ఎంతోమంది ఉన్నారని సూచించారు. పాఠశాల విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచే చర్యలు చేపట్టాలని భావిస్తున్నట్టు చెప్పారు. ‘పది’లో సత్తా చాటిన గురుకులాలు రాష్ట్రవ్యాప్తంగా సగటున 96.33 శాతం ఉత్తీర్ణత అత్యధికంగా జనరల్ సొసైటీలో 98.70శాతం పాస్ పెరుగుతున్న టెన్త్ ఉత్తీర్ణత – 2015లో 77 శాతం.. 2024లో 91 శాతం ఉత్తీర్ణత – 8 రెట్లు పెరిగిన 10 జీపీఏ విద్యార్థులు – ప్రైవేటుతో పోటీ పడుతున్న గురుకులాలు, మోడల్ స్కూల్స్ -
నాడు–నేడుకు దేశం ఫిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ విద్యా వ్యవస్థలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన నాడు–నేడుతో పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. ఆ అంశం యావత్ దేశాన్ని ఆకర్షిస్తోంది. నాడు–నేడు ద్వారా బడుగు, బలహీన వర్గాల పిల్లలకు పెద్దపీట వేయడాన్ని ఉత్తరాది రాష్ట్రాలు కొనియాడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పాఠశాలల పరిస్థితులు, ప్రస్తుతం సీఎం జగన్ హయాంలో పాఠశాలల స్థితిగతులపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కళ్లకు కట్టినట్లు వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. నాడు–నేడు షార్ట్ వీడియోలు ట్రెండీగా మారాయి. ఏపీలోని నాడు–నేడుపై దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ► రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు విద్యాసంస్థలను పట్టించుకోలేదు. ► విద్య, మధ్యాహ్న భోజన విషయంలో సైతం సర్కారీ బడులపై బాబు చిన్నచూపు చూశారు. ► 2014–19 మధ్య దాదాపు 1,785 పాఠశాలలను మూసివేసిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుంది.► 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక మెజార్టీ సీట్లతో గెలిచి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 58 నెలల్లో దాదాపు రూ.73 వేల కోట్లతో 45 వేల ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేశారు. ► 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ల ద్వారా విద్యాబోధన అందిస్తున్నారు. ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో..సీఎం జగన్ అమ్మఒడి కింద ఏటా రూ.15 వేలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.సోషల్ మీడియాలో పలువురి కామెంట్లు ఇలా..► ఇది కేవలం విజనరీ సీఎం జగన్ వల్లే సాధ్యం► నాకు ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ అంటే ఇష్టం.. మంచి విద్య, అద్భుతమైన ఆట స్థలాలు ► అవును ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా విద్యార్థులకు అవసరమే► దేశంలో ప్రతి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ని స్ఫూర్తిగా తీసుకోవాలి► ఏపీ సీఎం జగన్ కింగ్ ట్రెండింగ్లో కావ్య వీడియోసీఎం జగన్ విద్యా వ్యవస్థలో నాడు–నేడు ద్వారా తీసుకొచి్చన విప్లవాత్మక మార్పులను గుర్తిస్తూ ఢిల్లీకి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ‘కావ్య’ ఓ వీడియోను రూపొందించారు. ►విద్యా వ్యవస్థలో దేశంలోనే ఏపీ సరికొత్త అడుగులు వేసిందని, గతంలో ఉన్న అధ్వాన పరిస్థితిని సమూలంగా మార్చివేసిందంటూ ప్రశంసలు కురిపించారు. ►అత్యాధునిక ఫర్నిచర్, ఫ్యాన్లు, మరుగుదొడ్లు వంటివి ఏర్పాటు చేశారని.. ఆ రోజుల్లో మనకు ఇటువంటి సౌకర్యాలు లేవే అంటూ.. సీఎం జగన్ చేసిన మంచి పనిని మెచ్చుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ►ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి, ఐబీ సిలబస్ను పరిచయం చేయడం అభినందనీయమని, ఈ ఐదేళ్ల కాలంలో ఏపీలో నిరక్షరాస్యత తగ్గిందని, బడుగు, బలహీన వర్గాల వారికి చదువుపై ఆసక్తి పెరిగిందంటూ వీడియో చేశారు. ►ఆ వీడియోను యూట్యూబ్, ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేయడంతో పదిలక్షలకు పైగా నెటిజన్లు వీడియో చూసి, వేల సంఖ్యలో షేర్ చేస్తూ ‘సూపర్ ఏపీ స్కూల్స్’ అంటూ కితాబు ఇస్తున్నారు. ►మరికొంత మంది నాడు–నేడుపై షార్ట్ వీడియోస్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఉత్తరాది జనం ఫిదా అవుతున్నారు. ►యూపీ, హరియాణా, రాజస్థాన్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఈ తరహా విద్య ఉంటే బాగుంటుందంటూ కామెంట్ల రూపంలో వారి అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. ►దేశవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తూ ఇదే తరహా నాణ్యమైన విద్య దేశం మొత్తం తీసుకురావాలని, సీఎం జగన్ను కొనియాడుతూ లైకులు, కామెంట్లు, షేర్ చేస్తున్నారు. -
మన చదువుకు కీర్తి కిరీటం!
అంతర్జాతీయంగా మన ఉన్నత విద్యారంగం వెలుగులీనుతున్న వైనాన్ని వరసగా మూడో ఏడాది కూడా క్యూఎస్ (క్వాక్వరెలీ సైమండ్స్) జాబితా నిరూపించింది. బుధవారం ప్రకటించిన ఆ జాబి తాలో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్యూ) దేశంలోనే ప్రథమ స్థానం సంపాదించింది. అంతర్జాతీయంగా అభివృద్ధి అధ్యయనాల విభాగంలో 20వ ర్యాంకు సాధించి తనకెవరూ సాటిలేరని నిరూపించింది. వామపక్ష భావజాలం బలంగావున్న విద్యాసంస్థగా ముద్ర వున్న జేఎన్యూ ప్రతియేటా విద్యాప్రమాణాల విషయంలో తన సత్తా చాటుతూనే వస్తోంది. ఇక అహ్మదాబాద్ ఐఐఎం 25వ ర్యాంకు, బెంగళూరు, కలకత్తా ఐఐఎంలు 50వ స్థానంలోనూ వున్నాయి. డేటా సైన్స్లో, పెట్రోలియం ఇంజనీరింగ్లో గువాహటి ఐఐటీ క్యూఎస్ జాబితాలో చోటు సంపాదించుకుంది. పరిశోధనా రంగంలో మన దేశం నాలుగో స్థానంలో వుండటం ఈసారి చెప్పుకోదగిన అంశం. ఈ విషయంలో మనం బ్రిటన్ను అధిగమించటం గమనించదగ్గది. ఒకప్పుడు మన పరిశోధనలకు పెద్ద విలువుండేది కాదు. రెండేళ్లుగా ఈ ధోరణి మారడం మంచి పరిణామం. క్యూఎస్ ర్యాంకుల జాబితా అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మకమైనది. 96 దేశాల్లోని 1,559 విశ్వవిద్యాలయాల తీరుతెన్నులు 55 శాస్త్రాల్లో ఎలావున్నవో అధ్యయనం చేసి ఈ ర్యాంకులు నిర్ణయిస్తారు. ఇందుకు క్యూఎస్ పెట్టుకున్న కొలమానాలు ఆసక్తికరమైనవి. దేశంలోని విద్యాసంస్థలు వాటిని గమనిస్తే మన విద్యావ్యవస్థ ఎంతోకొంత మెరుగుపడుతుంది. విద్యా విషయక కార్య క్రమాల్లో, పరిశోధనల్లో ఒక విశ్వవిద్యాలయం పనితీరు ఎలావున్నదో అంతర్జాతీయంగా భిన్నరంగాల్లో నిష్ణాతులైనవారి అభిప్రాయాలు తీసుకుంటారు. అలాగే ఫలానా యూనివర్సిటీనుంచి వచ్చే పట్టభద్రుల్లో నైపుణ్యాలూ, సామర్థ్యమూ ఎలావున్నాయో వివిధ కంపెనీలనూ, సంస్థలనూ అడిగి తెలుసుకుంటారు. అధ్యాపకులు, విద్యార్థుల నిష్పత్తి, చదువు విషయంలో విద్యార్థులకు అందుతున్న మద్దతు వగైరాలు ఆరా తీస్తారు. అధ్యాపకుల ప్రమాణాలతోపాటు అధ్యాపకవర్గంలో వైవిధ్యత చూస్తారు. అంతర్జాతీయ నేపథ్యంవున్న అధ్యాపకులు, విద్యార్థులు ఎందరున్నారన్నది లెక్కేస్తారు. శాస్త్ర సాంకేతిక విద్యలో, తత్వశాస్త్ర విద్వత్తులో మన ప్రతిభావ్యుత్పత్తులు సాటిలేనివన్న ఖ్యాతి వుండేది. ఐటీరంగంలో మనవాళ్ల బుద్ధికుశలత వారిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన దాఖ లాలు కనబడుతూనే వున్నాయి. అయితే అంతర్జాతీయ ర్యాంకింగ్ల విషయంలో మన విశ్వవిద్యాల యాలు వెనకబడివుండేవి. ఆ కొలమానాలు, అందుకనుసరించే పద్ధతులు సక్రమంగా వుండవనీ, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదనీ కొందరు విద్యావేత్తలు అనేవారు. మనకు ఇష్టం వున్నా లేకున్నా ఆ ప్రమాణాలు అందుకోవటం తప్పదు. ఎందుకంటే ప్రపంచం నలుమూలలా వుండే విద్యార్థులు ఉన్నత విద్య కోసం మన గడప తొక్కాలంటే అది తప్పనిసరి. వివిధ దేశాల్లోని విద్యాసంస్థలందించే విద్య ఎలావున్నదో తులనాత్మక అధ్యయనం చేయటంవల్ల ఎవరు ఏ రంగంలో ముందంజలో వున్నారన్న సమాచారం వెల్లడవుతుంది. అది పై చదువులకెళ్లే విద్యార్థులకు మాత్రమే కాదు... పరిశోధకులకూ ప్రయోజనకారిగా వుంటుంది. అలాగే అంతర్జాతీయంగా ఎవరి భాగస్వామ్యం పొందితే మన విశ్వవిద్యాలయాల ప్రమాణాలు మెరుగుపడతాయో విధాన నిర్ణేతలు నిర్ధారించుకుంటారు. అయితే సంపన్న, వర్ధమాన దేశాల విశ్వవిద్యాలయాల మధ్య పోటీ పెట్టడం ఎంత మాత్రమూ సరైంది కాదన్న వాదనలు ఎప్పటినుంచో వున్నాయి. పరిశోధనలకూ లేదా పరికల్పనలకూ సంపన్న దేశాల్లో ప్రభుత్వాలనుంచీ, ప్రైవేటు వ్యక్తులనుంచీ నిధుల రూపంలో అందే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇక్కడ అది చాలా అరుదు. మన విశ్వవిద్యాలయాలు వెనకబడి వుండటానికి అదొక కారణం. ఇక ఇతర విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడుకోవాలి. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని తొలి యూపీఏ ఏలుబడిలో 2005లో దోహాలో జరిగిన డబ్ల్యూటీఓ–గాట్స్ సంభాషణల్లో సూత్రప్రాయంగా అంగీకరించిన పర్యవసానంగా ఇతర రంగాలతోపాటు విద్య కూడా ఖరీదైన వ్యవహారంగా మారింది. విదేశీ వర్సిటీలకు మన దేశం తలుపులు తెరిచింది. 2017లో నైరోబీలో జరిగిన డబ్ల్యూటీఓ సమావేశంలో ఎన్డీఏ సర్కారు సంతకం చేశాక 62 ఉన్నత విద్యాసంస్థలకు ‘ఆర్థిక స్వయంప్రతిపత్తి’ మొదలైంది. ఇది పరిమిత స్థాయిలోనైనా ప్రభుత్వ రంగ ఉన్నత విద్యా సంస్థలను ప్రైవేటీకరించటమే. పర్యవసానంగా ఉన్నత విద్యను అందుకోవటం నిరుపేద వర్గాలకు కష్టమవుతోంది. దానికితోడు అధ్యాపక నియామకాల్లోనూ, మౌలిక సదుపాయాలు కల్పించటంలోనూ ప్రభుత్వాలనుంచి మద్దతు కొరవడుతోంది. ఏతావాతా చాలా విశ్వవిద్యాలయాలు గత వైభవ చిహ్నాలుగా మిగిలాయి. ఇప్పుడు ఉన్నత శ్రేణి ర్యాంకులు పొందిన విద్యాసంస్థలకు దీటుగా ఇతర సంస్థలను కూడా తీర్చిదిద్దకపోతే, అన్ని వర్గాలకూ అందుబాటులోకి రాకపోతే ‘స్కిల్ ఇండియా’ వంటివి నినాదప్రాయమవుతాయని పాలకులు గుర్తించాలి. ఉన్నత విద్యను అందుకోవాలనుకునే పేద వర్గాల పిల్లలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం కల్పిస్తోంది. ఈ విధానం కింద దేశంలోనే కాదు... అంతర్జాతీయ అగ్రశ్రేణి సంస్థల్లో సీటు సంపాదించుకునేవారికి సైతం భారీ మొత్తాల్లో ఫీజులు చెల్లించటానికి సిద్ధపడుతోంది. వారు చదువుకునే కాలంలో అయ్యే వ్యక్తిగత ఖర్చు కూడా భరిస్తోంది. ఈ మాదిరి విధానం ఇతర రాష్ట్రాల్లో లేదు. క్యూఎస్ ర్యాంకుల జాబితా ఇలాంటి అంశాలపై పాలకులు దృష్టి సారించేలా చేయగలిగితే, లోపాలను సరిదిద్దగలిగితే అది మన విద్యా, వైజ్ఞానిక రంగాలను అత్యున్నత స్థాయికి చేరుస్తుంది. -
‘టెట్’ దరఖాస్తు గడువు పెంపు!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్)కు దరఖాస్తు గడువు పెంచాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. టెట్ దరఖాస్తు గడువు ఈ నెల 10(నేటి)తో ముగుస్తుంది. దీన్ని మరో వారం రోజుల పాటు పెంచాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను విద్యాశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి పంపింది. దీనిపై బుధవారం అధికారిక ఉత్తర్వులు వెలువడే వీలుంది. సర్వీస్ టీచర్ల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు టెట్ రాసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. 3లక్షలు వస్తాయనుకుంటే 2లక్షలు కూడా దాటలేదు టెట్కు ఇప్పటి వరకూ 1,93,135 దరఖాస్తులొచ్చాయి. 2016లో 3.40 లక్షలు, 2017లో 3.29 లక్షలు, 2022లో 3.79 లక్షలు,2023లో 2.83 లక్షల దరఖాస్తులొచ్చాయి. ఈ మధ్య కాలంలో బీఈడీ చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అయినప్పటికీ పదోన్నతుల కోసం సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయాలన్న నిబంధన ఉండటంతో ఈసారి 3 లక్షల అప్లికేషన్లు వస్తాయని అధికారులు అంచనా వేశారు. ఎన్సీటీఈ నుంచి సమాధానం వస్తేనే స్పష్టత 80 వేల మంది టీచర్లు టెట్ అర్హత కోసం దరఖాస్తు చేయాల్సి ఉండగా వారు ముందుకు రాలేదు. సెకండరీ గ్రేడ్ నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్కు టెట్ అవసరం. కానీ ఎస్జీటీగా ఉన్న వ్యక్తి ప్రాథమిక స్కూల్ హెచ్ఎంగా వెళితే, అది సమాన హోదాగా టీచర్లు చెబుతున్నారు. మరోవైపు స్కూల్ అసిస్టెంట్లు ప్రాథమిక, ఉన్నత పాఠశాల హెచ్ఎంగా వెళ్ళినా హోదాలో మార్పు ఉండదనే వాదన టీచర్లు లేవనెత్తారు. అలాంటప్పుడు టెట్తో అవసరం ఏమిటనే దానిపై ఉపాధ్యాయ సంఘాలు స్పష్టత కోరాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్య అధికారులు దీనిపై స్పష్టత ఇవ్వాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ)కి లేఖ రాశారు. ఒకటి రెండు రోజుల్లో దీనికి సమాధానం వస్తుందని ఆశిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టీచర్లు ఏయే పేపర్లు రాయాలి? ఎంత మంది రాయాలనే విషయాల్లో స్పష్టత వస్తుంది. పరీక్ష తేదీల్లో మార్పులు ఉండవు.. కేవలం దరఖాస్తు చేసుకోవడానికి, ఆన్లైన్ ఫీజు చెల్లింపుకు మాత్రమే గడువు పెంచే ఆలోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతే తప్ప పరీక్ష తేదీల్లో మార్పు ఉండదని స్పష్టం చేస్తున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం టెట్ పరీక్ష మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకూ జరుగుతుంది. ఫలితాలను జూన్ 12న వెల్లడిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారు డీఎస్సీ రాసేందుకు వీలుగా ఆ పరీక్ష గడువునూ పెంచారు. డీఎస్సీకీ అంతే.. పెద్దగా దరఖాస్తుల్లేవ్ డీఎస్సీ జూలై 17 నుంచి 31వ తేదీ వరకూ జరుగుతుంది. అయితే డీఎస్సీకి కూడా ఇప్పటి వరకూ పెద్దగా దరఖాస్తులు రాలేదు. పోస్టులు పెరిగినా కొత్తగా వచ్చిన దరఖాస్తులు తక్కువగానే ఉన్నాయి. రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సర్కారు డీఎస్సీని ప్రకటించింది. దీనికి కొత్తగా వచ్చిన దరఖాస్తులు 37,700. గతేడాది 5,089 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ కోసం 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. గడువు పెంచాల్సిందే : రావుల మనోహర్ రెడ్డి (డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు) టెట్ అప్లికేషన్స్ గడువు పెంచి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలి. ఉగాది, రంజాన్ సెలవుల కారణంగా రాష్ట్రంలో మీ సేవా సెంటర్లు అందుబాటులో ఉండటం లేదు. మొబైల్లో టెట్ దరఖాస్తులు పూర్తి చేయడం ఇబ్బందిగా ఉంది. స్పష్టత వచ్చే దాకా పెంచాలి : చావా రవి (టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) సర్వీస్ టీచర్లలో ఎంత మంది టెట్ రాయాలి? ఏ పేపర్ రాయాలి? అనే అంశాలపై విద్యాశాఖ స్పష్టత ఇవ్వలేదు. ఎన్సీటీఈ వివరణ వచ్చిన తర్వాత ఓ స్పష్టత ఇస్తామని అధికారులు తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టెట్ దరఖాస్తుల గడువు పెంచాలి. -
ప్రభుత్వ పాఠశాలల్లో ‘వాటర్ బెల్’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు డీహైడ్రేషన్కు గురికాకుండా, వడదెబ్బ బారిన పడకుండా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం వేసవి తీవ్రతతో ఎండలు పెరుగుతుండటంతో ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ‘వాటర్ బెల్’ విధానం అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రోజూ ప్రత్యేకంగా మూడుసార్లు వాటర్ బెల్ మోగించి.. విద్యార్థులంతా తప్పనిసరిగా మంచినీరు తాగేలా చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ఈనెల 23తో ముగియనుంది. అప్పటివరకు ‘వాటర్ బెల్’ కొనసాగించడంతో పాటు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్ 12 నుంచి కూడా ఇదే విధానాన్ని విద్యాశాఖ కొనసాగించనుంది. డీహైడ్రేషన్పై విద్యార్థుల్లో అవగాహన పెంపునకు ప్రత్యేక పోస్టర్లను సైతం పాఠశాలల్లో ఏర్పాటు చేయనుంది. విద్యాశాఖ ఆదేశాలతో ఏప్రిల్ 1 నుంచే విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎదిగే పిల్లల్లో నీటిలోపం లేకుండా చేసేందుకే.. శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు డీహైడ్రేషన్కు గురవుతారు. ఇదొక్కటే కాకుండా పలు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎదిగే పిల్లల్లో నీటి లోపం లేకుండా చూసేందుకు వాటర్ బెల్ విధానం ఉపయోగపడుతుంది. ప్రధానంగా మూత్రం ఏ రంగూ లేకుండా పారదర్శకంగా ఉంటే శరీరంలో తగినంత నీరు ఉందని, సరిపడినంత నీరు తాగుతున్నారని అర్థం. మూత్రం లేత గోధుమ రంగులో ఉంటే ఆరోగ్యంగా ఉన్నారని భావించవచ్చు. లేత పసుపు రంగులో ఉంటే సాధారణ స్థితి అని, ఆరోగ్యంగా ఉన్నట్లు సంకేతం. ముదురు పసుపు రంగులో మూత్రం ఉంటే నీరు తక్కువగా తాగుతున్నారని, మరికొంత నీరు శరీరానికి అవసరమని అర్థం. తేనె రంగులో ఉంటే శరీరానికి తగినంత నీరు అందడం లేదని సంకేతం. ముదురు గోధుమ రంగులో మూత్రం ఉంటే వెంటనే ఎక్కువ నీరు తాగాలని అర్థం. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో మూత్రశాలల వద్ద పోస్టర్లు అంటిస్తారు. రోజూ మూడుసార్లు వాటర్ బెల్ రాష్ట్రంలో 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో రోజూ ఉదయం 9.45, 10.05, 11.50 గంటలకు మొత్తం మూడుసార్లు వాటర్ బెల్ మోగిస్తున్నారు. బెల్లు మోగిన వెంటనే ప్రతి విద్యార్థి మంచినీరు తాగాల్సిందే. పాఠశాలల పునఃప్రారంభం తర్వాత కూడా వాటర్ బెల్ విధానాన్ని కొనసాగించాలని జిల్లా విద్యాధికారులను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. రోజూ వాటర్ బెల్ నిర్వహణను పర్యవేక్షించాలని డీఈవోలకు సూచించారు. అంతేకాకుండా మూత్రం రంగును బట్టి తమ శరీరంలో నీటి లోపాన్ని విద్యార్థులు తెలుసుకునేలా మూత్రశాలల వద్ద పోస్టర్లు అంటించాలని ఆదేశించారు. దీనిద్వారా నీరు తాగే అలవాటును విద్యార్థుల్లో పెంపొందించవచ్చన్నారు.
Related News by category
-
లారీల కొరత లేకుండా చూడాలి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చందుర్తి(వేములవాడ): కొనుగోలు కేంద్రాల్లో లారీలు, గన్నీ సంచుల కొరత లేకుండా చూ డాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జిల్లా అధికారులకు సూచించా రు. చందుర్తి సింగిల్విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ ఈ విషయమై విన్నవించగా.. వెంటనే జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడారు. రైతులు ఇబ్బందులు పడితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. చందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్, పార్టీ మండలాధ్యక్షుడు చింతపంటి రామస్వామి, జిల్లా కార్యదర్శి గొట్టే ప్రభాకర్, నాయకులు భీంరాజు కనకరాజు, దారం చంద్రం, వేల్పుల దేవస్వామి, పులి సత్తయ్య, ధర్మపురి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. బాధ్యతగా ఓటుహక్కు వినియోగించుకుందాం● జెడ్పీ సీఈవో ఉమారాణి సిరిసిల్ల: ఓటుహక్కు వినియోగం ప్రతీ ఒక్కరి బాధ్యత అని, పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని జెడ్పీ సీఈవో ఉమారాణి కోరారు. జిల్లా సమాఖ్యలో శుక్రవారం నిర్వహించిన మహిళల సమావేశంలో ఓటుహక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. జెడ్పీ సీఈవో మాట్లాడుతూ జిల్లాలో ప్రతీ ఓటరు ఎన్నికల్లో ఓటువేసేలా మహిళలు చైతన్యపరచాలన్నారు. ఓటుహక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేలా చూడాలన్నారు. స్వీప్లో భాగంగా జిల్లా సమాఖ్య ప్రతినిధులు ‘ఐ ఓటు ఫర్ ష్యూర్’ ‘ఓటుహక్కు నా బాధ్యత’ అంటూ నినాదాలు చేసి ప్రతిజ్ఞ చేశారు. డీఆర్డీవో శేషాద్రి, స్వీప్ నోడల్ అధికారి, అడిషనల్ డీఆర్డీవో గొట్టె శ్రీనివాస్, డీపీఎం సుధారాణి తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ సిరిసిల్ల: కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ను అర్థ గణాంకశాఖ డిప్యూటీ డైరెక్టర్ మోహన్రెడ్డి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షపాతం వివరాలు ఎలా నమోదవుతున్నాయో సందర్శించారు. మోహన్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 21 ఆటోమేటిక్ వెదర్స్టేషన్లు ఉన్నాయన్నారు. ఎప్పటికప్పుడు వాతావరణం వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తామని వివరించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని బోనాలలో వరి పంటకోత ప్రయోగం నిర్వహించారు. డీవైఎస్వోలు శ్యాంసుందర్, గణేశ్, సీపీవో శ్రీనివాసాచారి, జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ ఉన్నారు. రోడ్డు భద్రత నియమాలు పాటించాలి ● డీటీవో లక్ష్మణ్ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రోడ్డుపై తిరిగే ప్రతీ వాహనదారుడు తప్పకుండా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని జిల్లా వెహికల్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ కోరారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శుక్రవారం వాహన తనిఖీలు చేపట్టారు. సరైన ధ్రువీకరణపత్రాలు లేకపోవడంతో పలు వాహనాలను సీజ్చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. సుమారు 30 వాహనాల యజమానుల జరిమానాలు విధించారు. డీటీవో లక్ష్మణ్ మాట్లాడుతూ అతివేగంగా వాహనాలు నడిపితే డ్రైవింగ్లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే జైలుకెళ్లడం ఖాయమన్నారు. -
ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపు
సిరిసిల్ల: జిల్లాలో మొదటి ర్యాండమైజేషన్ను శుక్రవారం పరిశీలించారు. సర్దాపూర్ గోదాంలోని ఈవీ ఎంలను శుక్రవారం కలెక్టర్ అనురాగ్ జయంతి తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్ నుంచి సిరిసిల్ల, వే ములవాడ నియోజకవర్గాల్లోని స్ట్రాంగ్రూమ్లకు ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపు ప్రక్రియను పరిశీలించారు. పోలీసుల భద్రత మధ్య స్ట్రాంగ్రూమ్లకు తరలించారు. సిరిసిల్ల నియోజకవర్గానికి కంట్రోల్ యూనిట్స్ 358, బ్యాలెట్ యూనిట్స్ 358, వీవీ ప్యాట్లు 401, వేములవాడ నియోజకవర్గానికి కంట్రోల్ యూనిట్స్ 325, బ్యాలెట్ యూని ట్స్ 325, వీవీ ప్యాట్లు 364 కేటాయించారు. అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, ఎన్.ఖీమ్యానా యక్, సిరిసిల్ల, వేములవాడ ఆర్టీవోలు రమేశ్, రాజేశ్వర్, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్, వివిధ రాజకీయ పక్షాల నాయకులు పాల్గొన్నారు. మెరుగైన వైద్య సేవలందించాలి గంభీరావుపేట(సిరిసిల్ల): ప్రభుత్వ దవాఖానాల్లో మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. సముద్రలింగాపూర్, ము చ్చర్లలోని ఆరోగ్య ఉపకేంద్రాలను తనిఖీ చేశారు. సముద్రలింగాపూర్లో ఏర్పాటు చేసిన దంత వైద్యశిబిరాన్ని పరిశీలించారు. జిల్లా వైద్యాధికారి సుమన్మోహన్రావు, డిప్యూటీ డీఎంహెచ్వో రజిత, పీవో ఉమాదేవి, మెడికల్ ఆఫీసర్ వేణుగోపాల్, ఎంఎల్హెచ్పీలు శివాని, వనజ పాల్గొన్నారు. ● పరిశీలించిన కలెక్టర్ అనురాగ్ జయంతి -
దమ్ముంటే కాంగ్రెస్ను టచ్ చేయండి
సిరిసిల్లటౌన్: అధికారం నుంచి ప్రజలు తిరస్కరించినా కేసీఆర్, కేటీఆర్లకు అహం పోలేదని, తమ ప్రభుత్వాన్ని కూల్చుతామంటుండ్రని.. దమ్ముంటే కాంగ్రెస్ను టచ్ చేయండని మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. సిరిసిల్లలో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థులుగా నిలబెట్టిన వారే ఆ పార్టీ అవినీతి, నియంతృత్వంపై ఛీత్కరించుకుంటూ పార్టీని వీడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాపాలన అందించే కాంగ్రెస్పైనే ప్రజల ఆశీర్వాదం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ లేవీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నెరవేర్చలేదన్నారు. ప్రజాస్వామ్య విలువలు తెలువనోళ్లు రాజకీయం చేస్తే.. ఇట్లానే ఉంటుందని బీఆర్ఎస్, బీజేపీలను ఉద్దేశించి విమర్శించారు. ఆ పార్టీల ని యంతృత్వంపై ప్రజలు విసిగిపోయారని, రాహుల్ నేతృత్వంలో అందించే ప్రజాపాలనకే రానున్న ఎ న్నికల్లో ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చే శారు. బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటై సిరిసిల్లకు కేటా యించిన మెగా టెక్స్టైల్ క్లస్టర్ను వరంగల్కు తరలించి ఇక్కడి కార్మికుల ఉసురు పోసుకున్నారని ధ్వ జమెత్తారు. కరీంనగర్ నుంచి పార్టీ అభ్యర్థి గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. రూ.60కోట్ల అప్పు రూ.7లక్షలకు పెరిగింది అరవై ఏళ్లలో రూ.60కోట్లు అప్పులున్న తెలంగాణను పదేళ్లలో రూ.7లక్షల కోట్ల అప్పుల్లోకి కేసీ ఆర్ కుటుంబం నెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు గడువక ముందే కూలుతుందని శాపనార్థాలు పెడుతు న్న కేసీఆర్ కుటుంబ పార్టీకి ప్రజలు తగిన గుణపా ఠం చెబుతారన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ లన్నీ నాలుగు నెలల్లోనే అమలు చేశామని, రాహుల్గాంధీ ప్రకటించిన ఈ ఎన్నికల హామీలు సైతం అమలు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్ర విభజన హామీలు అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల స్ఫూర్తితో: ఆది శ్రీనివాస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు స్ఫూర్తితో పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిద్దామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో బీఆర్ఎస్ నియంతృత్వ పాలనను ప్రజలు పడగొట్టారని, ఇప్పుడు కేంద్రంలో నియంతృత్వాన్ని కూల్చడానికి సిద్ధమయ్యారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో కలిసేందుకు సిద్దమవుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ...బండి సంజయ్ చదువు రాని మొద్దని, ఆయనను గెలిపించుకున్నందుకే ఏమి అభివృద్ధి చేయలేదన్నారు. కేటీఆర్ పనైపోయిందని అమెరికాకు వెళ్లాలో..జైలుకు వెళ్లాలో తేల్చుకునే స మయం ఆసన్నమైందని చురక అంటించారు. చొ ప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ అబద్దాలు, మోసాలతో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్లు పాలన సాగించి ప్రజలను ఇబ్బందులు పెట్టారన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చా ర్జి కేకే మహేందర్రెడ్డి మాట్లాడుతూ గతంలో పాల న పోలీస్ నిర్బంధంలో సాగిందని ఇప్పుడు ప్రజా పాలనే నడుస్తుందన్నారు. నేరెళ్లలో దళితులపై పోలీస్లతో బీఆర్ఎస్ చేపట్టిన దాష్టీకాన్ని ప్రజలు మరువొద్దన్నారు. బతుకమ్మ చీరల ఆర్డర్ల డబ్బులు నేతన్నలకు ఇవ్వకుండా ఎందుకు బకాయి పెట్టావ్ కేటీఆర్ అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, సత్యనారాయణ, నాయకులు పెరుమాండ్ల శ్రీనివాస్, ప్రణవ్, నాగుల సత్యనారాయణ గౌడ్, సంగీతం శ్రీనివాస్, చీటి ఉమేశ్రావు, ఆకునూరి బాలరాజు, చొప్పదండి ప్రకాశ్, కనమేని చక్రధర్రెడ్డి, వైద్య శివప్రసాద్, మ్యాన ప్రసాద్, సూర దే వరాజు, పిట్టల భూమేశ్, కౌన్సిలర్లు రెడ్యానాయక్, కుడిక్యాల రవికుమార్, వేముల రవికుమార్, గోనె ఎల్లప్ప, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, వెల్ముల స్వరూప, కల్లూరి చందన, మడుపు శ్రీదేవి, గొట్టె రుక్మిణి పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులే ఆ పార్టీని వీడుతున్నారు రాష్ట్ర విభజన హామీలేవీ బీజేపీ నెరవేర్చలేదు ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ -
దమ్ముంటే ఎంపీగా పోటీ చెయ్..
● మంత్రి పదవికి రాజీనామా చేసిరా.. ఎవరికి ప్రజాదరణ ఉందో తేల్చుకుందాం ● బండి సంజయ్ తరఫున నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ నేతలుకరీంనగర్టౌన్: గత కొద్ది రోజులుగా బీజేపీ, బండి సంజయ్పైన మంత్రి పొన్నం ప్రభాకర్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ నాయకత్వం తీవ్రంగా స్పందించింది. ఇకనైనా పిచ్చివాగుడు మానుకోవాలని హెచ్చరించింది. పొన్నంకు దమ్ముంటే నేరుగా పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని సవాల్ విసిరింది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండి సంజయ్ కుమార్ తరఫున పార్టీ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, ప్రతాప రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ మేయర్ డి.శంకర్, కార్పొరేటర్ రమణారెడ్డి తదితరులు శుక్రవారం మధ్యాహ్నం కరీంనగర్ కల్టెకరేట్ కార్యాలయానికి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాననే విషయాన్ని పొన్నం మరిచిపోయారని అన్నారు. చివరకు న్యాయస్థానాలపై కూడా ఆరోపణలు చేస్తూ లిక్కర్స్కాం నిందితుడు శరత్ చంద్రారెడ్డి బీజేపీకి రూ.500 కోట్ల ఎలక్ట్రోబాండ్స్ ఇయ్యగానే... కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చిందని వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. శరత్ చంద్రారెడ్డికి బెయిల్ ఇచ్చింది గౌరవ సుప్రీంకోర్టు అని, బెయిల్కు, బాండ్స్కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. వెంటనే సుప్రీంకోర్టు పొన్నం వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని నోటీసులు జారీ చేయాలని కోరారు. ఏ సర్వే చూసినా బండి సంజయ్ బంపర్ మెజారిటీతో గెలవబోతున్నడని తేలడంతో పొన్నంకు ఫ్రస్టేషన్ ఎక్కువైందని, అందుకే కరీంనగర్ నుంచి అభ్యర్థి ఎవరో కూడా తేల్చలేకపోతున్నరని విమర్శించారు. ఘోరంగా కాంగ్రెస్ ఓడిపోతే మంత్రి పదవికే ఎసరొస్తుందనే భయం పొన్నంకు పట్టుకుందన్నారు. మంత్రిని అని మరిచిపోయి పొన్నం అడ్డగోలుగా ఆరోపణలు చేస్తూ సభ్యసమాజం అసహ్యించుకునేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పొన్నం ప్రభాకర్ ఇకనైనా బండి సంజయ్పై అవాకులు చవాకులు మానుకోవాలని హితవు పలికారు. -
శనివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024
పార్కుల వివరాలు ఇలా.. వెంకట్రావునగర్ రూ.60లక్షలు నెహ్రూపార్కు రూ.90లక్షలు శివనగర్ పార్కు రూ.40లక్షలు అంబికానగర పార్కు రూ.50లక్షలు ఇందిరాపార్కు రూ.80లక్షలు గణేష్నగర్ పార్కు రూ.50లక్షలు టీ.ఆర్.నగర్ పార్కు రూ.13లక్షలు పద్మనగర్ పార్కు రూ.15లక్షలు యాదాద్రి డెన్స్ పార్కు రూ.10లక్షలు అర్బన్ ఫారెస్టు పార్కు రూ.1.38లక్షలు మీరు చూస్తున్న ఈ చిత్రం సిరిసిల్ల ఇందిరాపార్కులోనివి. రూ.50లక్షలు పైబడి వెచ్చించిన ఈపార్కు అందాలు నిత్యం వందలాది మందికి కనువిందు చేసేవి. ఫొటో, వీడియో షూటింగ్స్కు అనుకూలంగా ఉండే ఈ పార్కు నిర్వహణ లోపంతో ఇలా డస్ట్బిన్స్ విరిగిపోయి, చెత్తకుప్పలతో, పచ్చదనం కనుమరుగైతుంది.వర్కర్లను సర్దుబాటు చేస్తున్నాం హరిత సిరిసిల్ల లక్ష్యాన్ని పాడుకానివ్వం. ప్రణాళికాబద్ధంగా మున్సిపల్ వర్కర్లతో పార్కులు, డివైడర్లు, జంక్షన్లలోని మొక్కలకు నీరు పోయిస్తున్నాం. పట్టణంలో గ్రీనరీ పనుల కోసం వర్కర్ల కొరతను సరిదిద్దుతున్నాం. ప్రత్యేక ప్రణా ళికతో పార్కుల నిర్వహణ సాగిస్తూ అవసరమై చోట్ల అభివృద్ధి పనులు చేపడతాం. – డి.లావణ్య, మున్సిపల్ కమిషనర్, సిరిసిల్ల సిరిసిల్లటౌన్: సిరిసిల్ల పట్టణ ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు స్మార్ట్సిటీ స్ఫూర్తితో సిరిసిల్లలో నిర్మించిన పార్కులు నిర్వహణ లేక బోసిపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు, సందర్శకులకు ఆహ్లాదం పంచేందుకు కార్పొరేట్ స్థాయిలో పార్కులు, జంక్షన్లు, డివైడర్లను సుందరీకరించారు. వాటి నిర్వహణను కొన్నేళ్లుగా మహిళా సమాఖ్యలకు కాంట్రాక్టు అప్పగించారు. కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యంతో పట్టణంలో పార్కులు కళావిహీనంగా మారాయి. ఇప్పుడు మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహణ సాగుతుండగా.. వర్కర్ల కొరత, నిధుల లేమితో పార్కులు పనికిరాకుండా పోయాయి. ఫలితంగా పట్టణ వాసులు, చిన్నారులు, పెద్దలు వేసవిలో ఆహ్లాదం కోసం వస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో కళావిహీనంగా మారిన స్మార్ట్ అందాలపై ఫోకస్.. ప్రజాధనం వృథా సిరిసిల్ల పట్టణంలో గత ప్రభుత్వం హయాంలో మాజీ మంత్రి కేటీఆర్ చొరవతో రూ.5.46 కోట్లతో పది పార్కులు, రూ.2.15 కోట్లతో ఆరు ప్రధాన కూడళ్లు, సుమారు రూ.10 కోట్లతో పట్టణం నుంచి ఇతర నగరాలకు వెళ్లే ప్రధాన రహదారుల విస్తరణతోపాటు డివైడర్లు, వాటి మధ్యలో గ్రీనరీ ఏర్పాటు చేశారు. ఇతర పట్టణాలకు ఆదర్శంగా నిలిచేందుకు రూ.కోట్లు వెచ్చించగా.. నిర్వహణ లోపం, పాలకులు, అధికారుల అలక్ష్యం ప్రజలకు ఆహ్లాదాన్ని దూరం చేస్తుంది. మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రతిరోజు పార్కులు, జంక్షన్లు, డివైడర్ల మధ్యలో గ్రీనరీ పెంచుతూ మొక్కలు, గడ్డి పాడవకుండా చూడాలి. ఏపుగా పెరిగిన చెట్లు, మొక్కలు, గడ్డిని నిత్యం కత్తిరించాలి. వాటిని నిర్ధేశిత ప్రాంతాల్లో వేయాలి. మొక్కలకు ఎరువు పెట్టడం, పాడయిన జిమ్ పరికరాలు, పాత్వేస్, ఫౌంటేన్స్ తదితరాలు రిపేరు చేయించాలి. కానీ మున్సిపల్ నిర్వహణ లోపంతో పార్కుల అందాలు కనుమరుగవుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యూస్రీల్ కనుమరుగైన పచ్చదనం సిరిసిల్ల వాసుల ఆగ్రహం నిరుపయోగంగా ప్రజా ఆస్తులు బోసిపోతున్న పార్కులు విరిగిన ఆట వస్తువులుపూర్తిగా పాడుబడిన తోటలాగా కనిపిస్తున్న ఈ ఫొటో శివనగర్ పార్కులోనివి. కార్మికవాడల్లోని ఈపార్కులో వర్కర్లు లేక, మున్సిపల్ పట్టింపు లేకుండా ఇలా మొక్కలు పాడై, చెట్లు విరుగుతూ.. పాత్ వేస్ పాడయి ఎండిపోయిన మొక్కలతో సందర్శకులకు దర్శనమిస్తుంది. ఇక్కడ పనిచేసే వారు లేక పార్కులో తాగుబోతులకు అడ్డాగా మారింది. స్మార్ట్సిటీ లుక్తో ఏర్పాటైన పార్కు ఇప్పుడు వట్టిపోతుంది.
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఫెడరల్ బ్యాంక్ ఫ్లాట్
అలా విమర్శించిన.. కాంగ్రెస్, బీజేపీపై చర్యలు
Madhumita Murgia: డీప్ఫేక్ గుట్టు ఆమెకు తెలుసు
మేనిఫెస్టోలో మోదీ.. యాడ్స్లో పవన్ ఫొటోలు ఎందుకు లేవు
కాంగ్రెస్ ‘సోషల్’ టీంలో ఐదుగురు అరెస్ట్
నేను గెలుస్తానో లేదో..
దొరుకుతున్నవన్నీ ‘పచ్చ’నోట్లే!
సెలబ్రిటీలతో ఎయిర్బీఎన్బీ జట్టు..
కర్నూలు ప్రెస్కు అరుదైన అవకాశం
14 నియోజకవర్గాల్లో 100 శాతం వీడియో నిఘా
Photos
View allVideo
View allతప్పక చదవండి
- బీజేపీతో జోడీ లేకపోతే ఈడీ
- అలా విమర్శించిన.. కాంగ్రెస్, బీజేపీపై చర్యలు
- దొరుకుతున్నవన్నీ ‘పచ్చ’నోట్లే!
- Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
- ఉద్యోగుల ఫ్రెండ్లీ సీఎం
- Bobbili: వాటీజ్ దిస్ ‘బేబీ’?
- ఏపీలో జగన్తోనే ముస్లిం రిజర్వేషన్లు: అసదుద్దీన్ ఒవైసీ
- ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
- బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
- జయరాం.. రాం!
Advertisement