హైదరాబాద్‌లో టెస్టు, విశాఖలో వన్డే | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో టెస్టు, విశాఖలో వన్డే

Published Sun, Jul 27 2014 1:34 AM

In hyderabad Test, visakhapatnam one day international

భారత్‌లో వెస్టిండీస్ పర్యటన
 న్యూఢిల్లీ: భారత్, వెస్టిండీస్ మధ్య జరిగే టెస్టు సిరీస్‌లో ఒక మ్యాచ్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇదే టూర్‌లో భాగంగా జరిగే వన్డే సిరీస్‌లో ఒక మ్యాచ్‌ను విశాఖపట్నంకు కేటాయించారు.
 
 ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లలో వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఇందులో ఇరు జట్ల మధ్య మూడు టెస్టులు, ఐదు వన్డేలు జరుగుతాయి. ఈ సిరీస్‌లో మరో రెండు టెస్టులు బెంగళూరు, అహ్మదాబాద్‌లలో జరగనుండగా...ఇతర వన్డేలకు కోల్‌కతా, కటక్, ధర్మశాల, కొచ్చి ఆతిథ్యం ఇవ్వనున్నాయి.  టి20 మ్యాచ్‌కు వేదికగా ఢిల్లీని నిర్ణయించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement