దుబాయ్: పాకిస్థాన్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓటమి దిశగా పయనిస్తోంది. 438 పరుగుల భారీ విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఆ జట్టు మ్యాచ్ నాలుగో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. రోజర్స్ (23 బ్యాటింగ్), స్మిత్ (3 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. పాక్ స్పిన్నర్లు యాసిర్ షా (2/8), బాబర్ (2/22) ఒక్కో ఓవర్లో రెండేసి వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బ తీశారు. ఫలితంగా వార్నర్ (29), డూలన్ (0), క్లార్క్ (3), లియోన్ (0) ఐదు పరుగుల తేడాతో పెవిలియన్ చేరుకున్నారు. స్పిన్కు అనుకూలిస్తున్న పిచ్పై చేతిలో ఉన్న ఆరు వికెట్లతో చివరి రోజు ఆసీస్ మరో 379 పరుగులు చేయడం దాదాపు అసాధ్యమే!
అంతకుముందు పాకిస్థాన్ తమ రెండో ఇన్నింగ్స్ను 2 వికెట్ల నష్టానికి 286 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అహ్మద్ షెహజాద్ (233 బంతుల్లో 131; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) కెరీర్లో రెండో సెంచరీ పూర్తి చేసుకోగా, యూనిస్ ఖాన్ (152 బంతుల్లో 103 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లోనూ శతకం సాధించడం విశేషం. 1974 తర్వాత ఆస్ట్రేలియా జట్టుపై ఒక బ్యాట్స్మన్ రెండు ఇన్నింగ్స్లలోనూ శతకం సాధించడం ఇదే తొలిసారి. ఈ సెంచరీతో పాకిస్థాన్ టెస్టు చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన (26) ఆటగాడిగా యూనిస్ ఖాన్ నిలవడం విశేషం.
పరాజయం దిశగా ఆసీస్
Published Sun, Oct 26 2014 1:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
విశ్వసనీయతే విజయానికి మెట్టు
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- కబ్జాల కందికుంట
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
Advertisement