శ్రీలంకపై భారత్‌ విజయం | Sakshi
Sakshi News home page

శ్రీలంకపై భారత్‌ విజయం

Published Thu, Jun 7 2018 2:33 PM

India beat Srilanka by 7 wickets - Sakshi

కౌలాలంపూర్‌: ఆసియాకప్‌ టీ20 టోర్నీలో భాగంగా శ్రీలంక మహిళలతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 108 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 18.5 ఓవర్లలో  మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దాంతో టోర్నీలో మూడు విజయాన్ని భారత్‌ సొంతం చేసుకుంది. భారత విజయంలో మిథాలీ రాజ్‌(23), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(24), వేదా కృష్ణమూర్తి(29 నాటౌట్‌), అనుజా పటేల్‌( 19 నాటౌట్‌)లు తలో చేయి వేశారు.

అంతకుముందు లంక మహిళలు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేశారు. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టులో యశోదా మెండిస్‌(27), హసిని పెరీరా(46 నాటౌట్‌) మినహా ఎవరూ రాణించలేదు. ఏడుగురు  క్రీడాకారిణులు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడంతో శ్రీలంక సాధారణ స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో ఏక్తా బిస్త్‌ రెండు వికెట్లు సాధించగా, గోస్వామి, అనుజా పటేల్‌, పూనమ్‌ యాదవ్‌లు తలో వికెట్‌ తీశారు.

Advertisement
Advertisement