టీమిండియా మూడోసారి. | Sakshi
Sakshi News home page

టీమిండియా మూడోసారి..

Published Sat, Feb 17 2018 11:55 AM

india got third time Five wins in an away bilateral series - Sakshi

సెంచూరియన్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి వన్డేలో భారత జట్టు విజయం సాధించిన తర్వాత విదేశాల్లో ఐదు వన్డేలను గెలిచిన ఘనతను మరింత పెంచుకుంది. గతంలో విదేశీ గడ్డపై ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో రెండు సందర్భాల్లో మాత్రమే ఐదు వన్డేల్లో విజయం సాధించిన టీమిండియా.. తాజాగా సఫారీలను మట్టికరిపించడం ద్వారా మూడోసారి సాధించినట్లయ్యింది.  అంతకుముందు 2013లో జింబాబ్వేతో వారి గడ్డపై ఐదు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌.. 2017లో శ్రీలంకతో వారి దేశంలో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను కూడా వైట్‌వాష్‌ చేసింది.


గతంలో ఆరు సార్లు దక్షిణాఫ్రికాలో పర్యటించినా ఒక్క వన్డే సిరీస్‌లో కూడా విజేతగా నిలవలేకపోయిన టీమిండియా.. ఈసారి విరాట్‌ కోహ్లి నేతృత్వంలో సగర్వంగా ఒడిసిపట్టుకుంది. అది కూడా 5-1 తేడాతో సిరీస్‌ గెలిచి సఫారీలకు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది.  కాగా, భారత జట్టుకిది వరుసగా తొమ్మిదో ద్వైపాక్షిక సిరీస్‌ విజయం కావడం మరో విశేషం.

Advertisement
Advertisement