'టీమిండియాను నిలువరించడం కష్టమే' | Sakshi
Sakshi News home page

'టీమిండియాను నిలువరించడం కష్టమే'

Published Mon, Mar 23 2015 4:40 PM

India is strong contender, says Faulkner

సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగే వన్డే ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం ఇరు జట్లు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. ఈ మ్యాచ్ కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. టీమిండియాను నిలువరించడం కష్టమేనని, సెమీస్లో తమకు గట్టిపోటీ తప్పదని ఆసీస్ ఆల్రౌండర్ ఫాల్కనర్ అన్నాడు.

భారత్ను తక్కువగా అంచనా వేయడం లేదని ఫాల్కనర్ పేర్కొన్నాడు. భారత బౌలింగ్ పటిష్టంగా ఉందని చెప్పాడు. కాగా ఈ మ్యాచ్లో స్పిన్ బౌలింగ్ పెద్దగా ప్రభావం చూపబోదని ఫాల్కనర్ అభిప్రాయపడ్డాడు. భారత బౌలర్లు అశ్విన్, జడేజా ప్రపంచ స్థాయి స్పిన్నర్లయినా, సిడ్నీ వికెట్ స్పిన్కు అనుకూలించదని అన్నాడు. ఈ వేదికపై దక్షిణాఫ్రికా, శ్రీలంకల మధ్య జరిగిన మ్యాచ్లో స్పిన్నర్లు అంతగా ప్రభావం చూపని విషయాన్ని గుర్తు చేశారు. భారత్తో సెమీస్ మ్యాచ్ తమకు ఫైనల్ లాంటిదని ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అన్నాడు. భారత్, ఆసీస్ల మధ్య ఈ నెల 26న సిడ్నీలో సెమీ ఫైనల్ జరగనుంది.

Advertisement
Advertisement