దుబాయ్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత్ (117) మళ్లీ రెండో స్థానానికి పడిపోయింది. ఆదివారం తాజాగా విడుదల చేసిన జాబితాలో ఆస్ట్రేలియా (117) అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇంగ్లండ్తో జరిగిన ఆఖరి వన్డేలో ఐదు వికెట్ల తేడాతో గెలిచిన ఆసీస్ ఐదు మ్యాచ్ల సిరీస్ను 4-1తో గెలుచుకుంది.
దీంతో దశాంశమానం తేడాతో టాప్ ర్యాంక్ను దక్కించుకుంది. అయితే భారత్ మళ్లీ నంబర్వన్కు చేరాలంటే కివీస్తో జరగబోయే రెండు మ్యాచ్ల్లోనూ గెలిచి తీరాలి. అప్పుడు 118 పాయింట్లతో అగ్రస్థానం దక్కుతుంది. లేదంటే రెండో ర్యాంక్తోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికా (110), ఇంగ్లండ్ (109), శ్రీలంక (108) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.
Related news
-
స్టీవ్ స్మిత్కు షాక్.. ఆసీస్ వరల్డ్కప్ జట్టులోకి విధ్వంసకర ఆటగాడు..!
ఆసీస్ సెలెక్టర్లు తమ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్కు భారీ షాకివ్వనున్నారని తెలుస్తుంది. వరల్డ్కప్ జట్టులో స్మిత్ స్థానం గల్లంతు కావడం ఖాయమని ఆసీస్ మీడియా కోడై కూస్తుంది. స్మిత్ స్థానంలో ఐపీఎల్ నయా సెన్సేషన్, ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసకర ఆటగాడు జేక్ ఫ్రేసర్ వరల్డ్కప్ జట్టులోకి వస్తాడని సమాచారం. జట్టు ప్రకటనకు మే 1 డెడ్లైన్ కావడంతో అన్ని జట్ల సెలెక్టర్లు తమతమ జట్లను ఫైనల్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలో ఆసీస్ సెలెక్టర్లు తమ జట్టుకు తుది రూపు తెచ్చినట్లు సమాచారం. నేడో రేపో 15 మంది సభ్యులతో కూడిన ఆసీస్ ప్రపంచకప్ జట్టును ప్రకటించే అవకాశం ఉంది. న్యూజిలాండ్ ఇవాళే తమ వరల్డ్కప్ జట్టును ప్రకటించగా.. టీమిండియాను ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈసారి టీమిండియా వరల్డ్కప్ జట్టుపై జనాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఒకరిద్దరి విషయంలో అభిమానులు చాలా పర్టికులర్గా ఉన్నారు. శివమ్ దూబే, రింకూ సింగ్ లాంటి ఆటగాళ్లను వరల్డ్కప్ జట్టుకు ఎంపిక చేయాలని పెద్ద ఎత్తును డిమాండ్లు వినిపిస్తున్నాయి. హార్దిక్, సంజూ శాంసన్, రిషబ్ పంత్ విషయంలో సెలెక్టర్ల నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.స్మిత్ విషయానికొస్తే.. ఈ ఆసీస్ స్టార్ను ఐపీఎల్ 2024 వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. స్మిత్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కామెంటేటర్గా కొనసాగుతున్నాడు. ఇటీవలే స్మిత్కు జాతీయ జట్టు ఓపెనర్గా ప్రమోషన్ లభించినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. నిదానంగా ఆడతాడన్న ముద్ర స్మిత్పై ఉండనే ఉంది. స్మిత్కు ప్రత్యామ్నాయాలు కూడా ఆసీస్కు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరల్డ్కప్ జట్టులో స్మిత్కు స్థానం దొరకకపోవడం ఆశ్చర్యకరమేమీ కాదు. -
దుబాయ్లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
దుబాయ్లో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దుబాయ్లో నిర్మించబోతున్నారు. ఈ మేరకు దుబాయ్ రాజు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటన చేశారు. దీని కోసం 35 బిలియన్ డాలర్లు (రూ.2.9 లక్షల కోట్లు) ఖర్చు చేయనున్నారు.వివరాల ప్రకారం.. దుబాయ్లో ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం నిర్మించచోతున్నారు. ఈ విషయాన్ని దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్ ఆదివారం ప్రకటించారు. ఈ విమానాశ్రయం పేరును అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలవనున్నట్లు ఆయన తెలిపారు. ఇది ఈ విమానాశ్రయాం నిర్మించడానికి 35 బిలియన్ డాలర్లు (రూ.2.9 లక్షల కోట్లు) ఖర్చు చేయనున్నారు. ఏడాదికి 260 మిలియన్ల మంది రాకపోకలు కొనసాగించేలా ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.ఒక్క ఏడాదిలో దాదాపు 260 మిలియన్ల మంది ప్రయాణీకులు ఈ ఎయిర్పోర్టు ద్వారా ప్రయాణాలు కొనసాగించవచ్చన్నారు. ఈ విమానాశ్రయంలో ఐదు సమాంతర రన్వేలు, 400 ఎయిర్క్రాఫ్ట్ గేట్స్ దీని ప్రత్యేకతలుగా చెప్పారు. కాగా, అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రస్తుత దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంటే ఐదు రెట్లు పెద్దదిగా ఉంటుంది. రాబోయే సంవత్సరాల్లో దుబాయ్ ఎయిర్పోర్టు నుండి అన్ని కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. Today, we approved the designs for the new passenger terminals at Al Maktoum International Airport, and commencing construction of the building at a cost of AED 128 billion as part of Dubai Aviation Corporation's strategy.Al Maktoum International Airport will enjoy the… pic.twitter.com/oG973DGRYX— HH Sheikh Mohammed (@HHShkMohd) April 28, 2024 ఇక, ఈ ఎయిర్పోర్టు ఫ్లాగ్షిప్ క్యారియర్ ఎమిరేట్స్, లోబడ్జెట్ విమానయాన సంస్థ ఫ్లైదుబాయ్తో పాటు ప్రపంచాన్ని దుబాయ్కి, బయటికి కనెక్ట్ చేసే అన్ని ఎయిర్లైన్ భాగస్వాములకు కొత్త డెస్టినేషన్ కానుందని దుబాయ్ ప్రభుత్వ ఎయిర్లైన్ ఎమిరేట్స్ చైర్మన్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్-మక్తూమ్ వెల్లడించారు. ఈ నిర్మాణం ప్రపంచ వేదికపై ప్రముఖ ఏవియేషన్ హబ్గా దుబాయ్ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందని దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సీఈఓ పాల్ గ్రిఫిత్స్ తెలిపారు. -
ప్రేయసిని నిశ్చితార్థం చేసుకున్న ఆసీస్ మహిళా స్టార్ క్రికెటర్..
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆష్లీ గార్డనర్ తన చిరకాల స్నేహితురాలు మోనికా రైట్ను నిశ్చితార్థం చేసుకుంది. గత మూడేళ్లగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట.. తమ బంధంలో మరో అడుగు ముందుకు వేసింది. శుక్రవారం కొంతమంది సన్నిహితుల మధ్య వీరిద్దరూ ఉంగరాలు మార్చకున్నారు. తమ నిశ్చితార్థ ఫొటోలను గార్డ్నర్ సోషల్మీడియా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు కాబోయే కొత్త జంటకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా గార్డ్నర్, మోనికాలు 2021 నుంచి ప్రేమలో ఉన్నారు. గార్డ్నర్ను సపోర్ట్ చేసేందుకు మోనికా చాలా సందర్బాల్లో స్టేడియం వచ్చేది. 2017లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన గార్డనర్ .. ప్రస్తుతం ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టులో కీలక సభ్యురాలుగా కొనసాగుతోంది. గార్డనర్ తన కెరీర్లో ఇప్పటివరకు ఆరు టెస్టులు, 69 వన్డేలు, 88 టీ20 మ్యాచ్ల్లో ఆసీస్కు ప్రాతినిథ్యం వహించింది. ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో 2583 పరుగులతో పాటు 180 వికెట్లు పడగొట్టింది. మహిళల ప్రీమియర్ లీగ్లో గుజరాత్ జెయింట్స్ జట్టుకు గార్డనర్ ప్రాతినిథ్యం వహిస్తోంది. View this post on Instagram A post shared by Ashleigh Gardner (@ashleigh_gardner97) -
ఏడాదిలో కురవాల్సిన వాన ఒక్కసారిగా కురిస్తే ఇలా ఉంటుందా..!
వర్షం అనేది మనకు సీజన్ల బట్టే వస్తోంది ఒక్కోసారి సమ్మర్లో కూడా వచ్చిన అదికూడా ఓ మోస్తారుగా వస్తుంది. వర్షాకాలంలోనే మనకు అత్యధికంగా వర్షాలు పడతాయి. ముఖ్యంగా ఎడారి దేశమైన దుబాయ్ లాంటి దేశాల్లో వర్షం అనేది చాలా తక్కువ. ఏడాదికి చాలా తక్కువ వర్షపాతమే నమోదవ్వుతుంది. అలాంటిది ఇటీవల దుబాయ్ని వణికించేలా వర్షాలు పడ్డాయి. ఒక్కసారిగా దుబాయ్లోని కార్లు, బహుళ అంతస్థులు నీట మునిగాయి. అంతేగాదు కనివిని ఎరుగని రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. చెప్పాలంటే ఒక్క ఏడాదిలో కురవాల్సిన వానంతా ఒక్కరోజే పడితే ఎలా ఉంటుందో అలా కుండపోతగా కురిసేసింది. అంతేగాదు అక్కడ అధికారులు కూడా ఇలాంటి వానను ఎన్నడు చూడలేదని ఇది "చారిత్రక వాతావరణ సంఘటన" అని చెబుతున్నారు. దుబాయ్ 75 ఏళ్ల చరిత్రలో ఇలాంటి వర్షాన్ని చూడలేదని తెలిపారు. ఈ భారీ వర్షాలకు ఎడారి దేశమైన దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ చిగురుటాకులా వణికిపోయింది. ఈ భారీ వర్షాలు యూఏఈనే కాకుండా ఒమన్ని కూడా తాకింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన చాలామంది నెటిజన్లు ముంబైలో ఉండగా కూడా తాము ఇలాంటి వర్షాన్ని చూడలేదంటున్నారు. ఎడారిలాంటి దుబాయ్ అంతటా కాలువలు పారుతున్నాయంటూ పోస్టులు పెట్టారు. Dubai: Timelapse of the massive storm that caused a historic flood. pic.twitter.com/tackWMYJzO — Pagan 🚩 (@paganhindu) April 17, 2024 (చదవండి: అతిపెద్ద పాము వెలుగులోకి..అది సాక్షాత్తు పరమేశ్వరుడి..!) -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం (ఫొటోలు)
Related News by category
-
CWC 2023 SA VS SL: శ్రీలంకను చిత్తు చేసిన సౌతాఫ్రికా
సౌతాఫ్రికా-శ్రీలంక జట్ల మధ్య న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా సెంచరీల మోత మోగించింది. ఈ రోజు (శనివారం) జరిగిన పోరులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్లో ఏకంగా ముగ్గురు సౌతాఫ్రికా ఆటగాళ్లు శతక్కొట్టారు. క్వింటన్ డికాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), రస్సీ వాన్ డెర్ డస్సెన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకాల మోత మోగించడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 428 పరుగులు చేసింది. వన్డే వరల్డ్కప్ చరిత్రలో ఇదే అత్యధిక టీమ్ స్కోర్గా రికార్డుల్లోకెక్కింది. A stellar batting performance helps South Africa to a massive win in their #CWC23 clash against Sri Lanka 💪#SAvSL 📝: https://t.co/6P9uKyV5lF pic.twitter.com/LxZPnRHPKN — ICC Cricket World Cup (@cricketworldcup) October 7, 2023 అయితే 428 పరుగుల భారీ లక్ష్యాన్ని చేరుకోవడంలో శ్రీలంక జట్టు విఫలమైంది. లక్ష్య ఛేదనలో శ్రీలంక ఆరంభంలోనే ఓపెనర్లను కోల్పోయింది. నిస్సంక (0) డకౌట్ అయ్యాడు. కాసేపటికే కుశాల్ పెరీరా (7) కూడా ఔటయ్యాడు. ఇక ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన కుశాల్ మెండీస్ మాత్రం తన ఆటతో శ్రీలంక జట్టు పై ఆశలు రేకెత్తించాడు. మొత్తం 8 సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. అనంతరం కగిసో రబడ బౌలింగ్లో ఔటయ్యాడు. ఈ దశలో చరిత్ అసలంక, దాసున్ షనకలు కాసేపు జట్టు విజయం కోసం పోరాటం చేశారు. వీరిద్దరు తమ జోరు చూపించారు. ఆ సమయంలో శ్రీలంక లక్ష్యానికి చేరువయ్యే అవకాశం కనిపించింది. అయితే అసలంక, ఆ తర్వాత షనక ఔటవ్వడంతో 326 పరుగుల వద్దే శ్రీలంక కథ ముగిసింది. మొత్తానికి 102 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. స్కోర్లు: సౌతాఫ్రికా- 428, శ్రీలంక- 326 -
తీవ్ర విషాదం.. క్రికెటర్ ఈశ్వర్ ఇకలేరు
విశాఖపట్నం: జీవీఎంసీ 68వ వార్డు గుడివాడ అప్పన్నకాలనీకి చెందిన క్రికెటర్ సోముదల ఈశ్వర్(40) కన్నుమూశారు. ఆగస్టు 28వ తేదీనే ఆయన గుండెపోటుతో మృతి చెందగా.. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన క్రికెట్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. విశాఖలో డివిజన్ క్రికెట్ ఆడుతూనే ఈశ్వర్ అంచెలంచెలుగా ఎదిగాడు. ఏసీఏకు చేదోడు వాదోడుగానూ ఉంటూ.. టోర్నీల నిర్వహణలో సహాయం అందించేవాడు. అలా ఆయన ప్రతిభ ఐపీఎల్కు తాకింది. ఎడమ చేతి వాటం బౌలర్ అయిన ఈశ్వర్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్ బ్యాటర్లకు నెట్స్లో బంతులు విసిరేందుకు సహాయకుడిగా చేరాడు. ఐపీఎల్లో సపోర్టింగ్ స్టాఫ్గా ప్రస్థానం కొనసాగిస్తూనే.. విశాఖలో జరిగిన ఏపీఎల్ సీజన్ పాల్గొన్నాడు. ఇటీవల ఏపీఎల్ సీజన్ ముగియడంతో అప్పన్నకాలనీలోని తన ఇంటికి చేరుకున్నాడు. ఈ నెల 28న స్నేహితులతో బయటకు వెళ్లి తిరిగి రాత్రి 8.30 గంటలకు ఇంటికి వచ్చాడు. బైక్ దిగి స్టాండ్ వేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని తల్లి రాములమ్మ తెలిపారు. ఆస్పత్రికి తరలించే లోపు మృతి చెందాడని బోరున విలపించారు. ఈ వార్త విన్న భారత క్రికెటర్ శ్రీకర్ భరత్.. ఈశ్వర్ ఇంటికి చేరుకుని ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈశ్వర్కు వివాహం కాలేదు. క్రికెటర్ వేణుగోపాల్తో సాన్నిహిత్యం తన 16వ ఏటనే క్రికెట్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఈశ్వర్కు పేదరికం వెంటాడింది. 10వ తరగతి వరకు చదువుకున్న ఈశ్వర్ క్రికెట్టే ప్రపంచంగా భావించాడు. క్రికెటర్ వేణుగోపాల్, ఈశ్వర్ ఇద్దరూ రంజీ సెలక్షన్కు వెళ్లారు. వేణుగోపాల్ రంజీకి ఎంపిక కాగా.. ఈశ్వర్కు నిరాశే మిగిలింది. అయినా ఏనాడు కుంగిపోలేదు. ఈ క్రమంలో ఈశ్వర్పై అభిమానం పెంచుకున్న వేణుగోపాల్ తనతో పాటు పలు మ్యాచ్లకు తీసుకువెళ్లేవాడు. ఈశ్వర్ ఫాస్ట్ బౌలర్. గంటకు 150 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసేవాడు. ఈశ్వర్ బౌలింగ్ అంటే భారత క్రికెటర్లకు ఎంతో ఇష్టం. అందుకే స్టార్ క్రికెటర్లు ఆయనతో బౌలింగ్ వేయించుకుని నెట్ ప్రాక్టీస్ చేసేవారు. దీంతో ఈశ్వర్కు ఎక్కువగా భారత క్రికెట్ క్యాంపుల్లో అవకాశం దక్కేది. అలా సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, రికీ పాటింగ్, డేవిడ్ వార్నర్.. తదితర ఎంతో మంది క్రికెటర్లకు అభిమానిగా మారాడు. ఈశ్వర్ను ఎక్సట్రా ప్లేయర్గా అన్ని విషయాల్లో సమానంగా చూసుకునే వారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈశ్వర్ మరణవార్త తెలుసుకున్న క్రికెటర్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ ప్రగాఢ సానుభూతిని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈశ్వర్ మృతి బాధాకరం నేనూ ఢిల్లీ కాపిటల్స్ జట్టుకు ప్రస్తుత సీజన్ ఐపీఎల్లో ఆడాను. జట్టుతో పాటు ప్రాక్టీస్ చేసేప్పుడు ఈశ్వర్ నెట్స్లో బంతులు విసిరేవాడు. ఇద్దరం విశాఖ వాసులమే కావడంతో తొలినాళ్ల నుంచి అతనితో పరిచయం ఉంది. అతను అకస్మాత్తుగా మృతి చెందడం బాధాకరం. – భరత్, భారత టెస్ట్ క్రికెటర్ ప్రగాఢ సానుభూతి మా అన్ని శిక్షణ సెషన్స్, మ్యాచ్ల్లో జట్టుకు సహాయకారిగా ఉన్న ఈశ్వర్ను మిస్ కావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. మా ప్రియమైన సైడ్ ఆర్మ్ స్పెషలిస్ట్ ఈశ్వర్ ఇకలేరు. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. – ఢిల్లీ కాపిటల్స్ మేనేజ్మెంట్ -
గోల్ కొట్టిన విరాట్కోహ్లీ.. జస్ట్మిస్
క్రికెట రారాజు విరాట్కోహ్లీ ... ఫుట్బాల్ మైదానంలో సందడి చేశాడు. క్రికెట్ ఆటలో ఎంతో కచ్చితత్వంతో బాల్ని బౌండరీలు దాటించే కోహ్లీ.. అదే తీరుని ఫుట్బాల్ మైదానంలోనూ చూపించాడు. ఆక్సిడెంటల్ క్రాస్బార్ ఛాలెంజ్ పేరుతో చాలా దూరం నుంచి గోల్పోస్ట్కి గురి పెట్టాడు కోహ్లీ. తన నైపుణ్యం అంతా ఉపయోగించి బాల్ని కిక్ చేశాడు. గోల్కీపర్ను తప్పించుకుని గోల్పోస్ట్లో బాల్ పడినట్టే అనిపించింది. అయితే చివరి క్షణంలో గోల్పోస్ట్ పోల్కి బాల్కి అడ్డుగా నిలిచింది. దీంతో గోల్ మిస్ అయ్యింది. క్రికెట్లోనే కాదు ఫుట్బాల్లోనూ కోహ్లీ ఆటకు అభిమానులు ఫిదా అవుతున్నారు Accidental crossbar challenge 😂 pic.twitter.com/koeSSKGQeb — Virat Kohli (@imVkohli) May 25, 2021 -
ఇంగ్లండ్కు భారీ షాక్: న్యూజిలాండ్తో సిరీస్కు ఆర్చర్ దూరం
లండన్: న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కు ముందు ఇంగ్లండ్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా దూరమయ్యాడు. మోచేతి గాయం తిరగబెట్టడంతో వచ్చే నెలలో న్యూజిలాండ్తో జరిగే రెండు టెస్టులకు అతడు అందుబాటులో ఉండడని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. గాయం కారణంగా భారత్ పర్యటన, ఐపీఎల్లకు దూరమైన ఆర్చర్.. కౌంటీ క్రికెట్లో ససెక్స్ తరపున పునరాగమనం చేశాడు. మళ్లీ గాయం తిరగబెట్టడంతో కేవలం ఐదు ఓవర్లు బౌలింగ్ చేసిన వెంటనే మైదానాన్ని వీడాడు. ఇంగ్లాండ్, ససెక్స్ సీమర్ జోఫ్రా ఆర్చర్ వచ్చే నెల న్యూజిలాండ్తో జరిగే టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నాడని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. బౌలింగ్ చేసేటప్పుడు అతని కుడి మోచేయి నొప్పితో బాధపడ్డాడు. మ్యాచ్ చివరి రెండు రోజులలో బౌలింగ్ చేయలేకపోయాడని ఈసీబీ వివరించింది. ఇంగ్లండ్,న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్ట్ జూన్ 2న లార్డ్స్ మైదానంలో ప్రారంభంకానుంది. చదవండి: శ్రీలంక ఆటగాళ్ల జీతాల్లో 35 శాతం కోత -
ఆటగాళ్లకు షాకిచ్చిన శ్రీలంక క్రికెట్ బోర్డు
కొలంబో: శ్రీలంక క్రికెట్ బోర్డులో ఆటగాళ్ల జీతాలు తగ్గించడంపై వివాదం తలెత్తింది. ఆటగాళ్ల జీతాల్లో 35 శాతం కోత విధిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డ్ నిర్ణయం తీసుకొన్నది. దీంతో కెప్టెన్ కరుణరత్నే, మాథ్యూస్,సురంగ లక్మల్,దినేష్ చండిమల్ సహా పలువురు సీనియర్ క్రికెటర్లు ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించారు. కొత్త కేంద్ర ఒప్పందం ప్రకారం వికెట్ కీపర్లు నిరోషన్ దిక్వేలా, ధనంజయ్ డి సిల్వా మాత్రమే లబ్ధి పొందనున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్ల నెలసరి జీతం దాదాపు రూ.73 లక్షలు. బోర్డు వీరిని టాప్ క్యాటగిరిలో వేసింది. దీంతో మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న బంగ్లాదేశ్ వన్డే సిరీస్పై నీలినీడలు కమ్ముకున్నాయి. మే 23 నుంచి బంగ్లాదేశ్లో ఈ జట్టు 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడవలసి ఉన్నది. కెప్టెన్కు కూడా తగ్గనున్న జీతం అద్భుతమైన ఫామ్లో ఉన్న కెప్టెన్ కరుణరత్నేకు కూడా ఆయన జీతంలో రూ.22 లక్షలు కోత విధించారు. ఈ ఏడాది జనవరిలో వాండరర్స్లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో సెంచరీ చేసిన కరునరత్నే.. బంగ్లాదేశ్తో సిరీస్లో 3 ఇన్నింగ్స్లలో 427 పరుగులు చేసి తానేంటో నిరూపించుకున్నాడు. అయినప్పటికీ బోర్డు నుంచి ఏమాత్రం ఉపశమనం లభించలేదు. కొత్త కాంట్రాక్టులో కరుణరత్నే జీతం రూ.73 లక్షల నుంచి రూ.51 లక్షలకు తగ్గించారు. (చదవండి:10-12 ఏళ్లు.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా: సచిన్)
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- కొత్తపల్లి గీతకు డిపాజిట్ దక్కేనా?
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement