ఐసీసీతోనే కోహ్లి ఢీ!
మాజీ ఆటగాళ్ల వాగ్వాదాలు
భారత జట్టు దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్ సొంతం చేసుకుందనేది వాస్తవం. స్పిన్ ప్రభావమో, సఫారీల బ్యాటింగ్ వైఫల్యమో... కారణం ఏదైనా భారత్ సిరీస్ గెలిచింది. అయితే నేరుగా తన ప్రమేయం లేకపోయినా పిచ్ల చుట్టూ సాగుతున్న చర్చ భారత కెప్టెన్ విరాట్ కోహ్లికి విజయానందాన్ని దూరం చేస్తోంది. భవిష్యత్తులోనూ సొంతగడ్డపై తన తొలి విజయాన్ని ఘనంగా చెప్పుకునే అవకాశం లేకుండా పోతోంది. ఒక దశలో రచ్చ ముగిసిపోయినట్లు కనిపించినా... నాగ్పూర్ వికెట్పై ఐసీసీ వివరణ కోరడంతో వాతావరణం మళ్లీ వేడెక్కింది. వికెట్పై వస్తున్న విమర్శలకు కెప్టెన్, డెరైక్టర్ కలిసి ఎదురుదాడి మొదలు పెట్టారు.
న్యూఢిల్లీ: మొహాలీ టెస్టు మూడు రోజుల్లోపే ముగిసినా ఇంతగా విమర్శలు రాలేదు. బెంగళూరులో తొలి రోజే దక్షిణాఫ్రికా ఆలౌటైనా పెద్దగా చర్చ జరగలేదు. కానీ నాగ్పూర్లో సఫారీలు చిత్తుగా ఓడిన తర్వాత మాత్రం ‘పిచ్ పాపం’ అంటూ అన్ని వైపులనుంచి విమర్శలు మొదలయ్యాయి. అనూహ్యంగా ఐసీసీ కూడా జామ్తాపై నివేదిక ఇవ్వాలంటూ బీసీసీఐని కోరడం పిచ్ల పనితీరుపై తేనెతుట్టను కదిలించింది. సరిగ్గా ఇదే విషయం భారత కెప్టెన్ కోహ్లికి మంట తెప్పించింది. దాంతో అతను ఐసీసీపైనే తన వ్యాఖ్యల గురి పెట్టాడు. ‘పిచ్ గురించి పదే పదే వచ్చిన కథనాల గురించే కాదు. వికెట్ గురించి వివరణ కోరుతున్న వారి గురించి (పరోక్షంగా ఐసీసీని ఉద్దేశించి) కూడా మాట్లాడుతున్నా. ఎక్కడా దీనిని పట్టించుకోకపోయినా మన దగ్గర మాత్రం పిచ్పైనే అందరూ దృష్టి పెడతారు. పరాయి దేశంలో మనం ఓడితే ఆట చేత కానట్లు. అదే వారు ఇక్కడ ఓడితే మాత్రం పిచ్ది తప్పవుతుందా’ అని కోహ్లి ఘాటుగా వ్యాఖ్యానించాడు.
అక్కడ జరగలేదా?
1996 డర్బన్ టెస్టులో అలెన్ డొనాల్డ్ (9/54) ధాటికి భారత్ రెండు ఇన్నింగ్స్లలో 100, 66 పరుగులకే కుప్పకూలింది. మొత్తం కలిపి మన బ్యాటింగ్ 73.2 ఓవర్లే సాగింది. ఈ మ్యాచ్ గురించే కాకపోయినా కోహ్లి అక్కడి పిచ్లు, ఆ సమయంలో ఎవరూ విమర్శించని విషయాన్ని గుర్తు చేయడం విశేషం. అతని వాదనలోనూ వాస్తవం కనిపిస్తుంది. ‘సఫారీ గడ్డపై 50లోపు స్కోరు మూడు సార్లు నమోదైంది. ఆరు సార్లు 100 లోపే జట్లు ఆలౌట్ అయ్యాయి. కానీ నాడు పిచ్ గురించి ఎవరూ ఇంతగా రాయలేదు. అడిలైడ్ టెస్టు రెండున్నర రోజుల్లోపే ముగిసినా ఒక్క కథనం నాకు కనిపించలేదు. ఇప్పటికే దీని గురించి ఎక్కువగా మాట్లాడారు. ఇకపై ఏమీ చెప్పదల్చుకోలేదు’ అని కుండబద్దలు కొట్టాడు.
శాస్త్రి-హేడెన్ మాటల యుద్ధం
నాగ్పూర్ పిచ్ మాజీ ఆటగాళ్ల మధ్య కూడా చిచ్చు పెట్టింది. తొలి రోజే బంతి టర్న్ కాకూడదని ఏ నిబంధనల పుస్తకంతో రాసి ఉందంటూ ప్రశ్నించిన రవిశాస్త్రి... ఆస్ట్రేలియాలో కూర్చొని ఇక్కడి పిచ్లపై మాట్లాడవద్దంటూ, వచ్చి ఆడాలని మాజీలకు సవాల్ విసిరారు. అయితే తనకా హక్కు ఉందంటూ మ్యాథ్యూ హేడెన్ దానిని తిప్పికొట్టారు. తాను 103 టెస్టులు ఆడానని.. క్రికెట్ను ప్రేమించే, ఆట బాగు పడాలని కోరుకునే తనలాంటి వారే పిచ్ గురించి మాట్లాడతారని హేడెన్ గుర్తు చేశారు. మరో వైపు మ్యాచ్ ఫలితం ఆటగాళ్ల చేతిలో ఉంటుందని, క్యురేటర్ ఏమీ చేయలేడని బీసీసీఐ పిచెస్ కమిటీ చైర్మన్ దల్జీత్ సింగ్ స్పష్టం చేశారు. క్రికెటర్లు సరిగా ఆడకపోతే పిచ్లపైనే చర్చ వస్తుందన్న దల్జీత్...‘దేవుడు దయతలిస్తే ఎలాంటి సమస్య ఉండకపోవచ్చు’ అంటూ ఢిల్లీ పిచ్పై వ్యాఖ్యానించడం కొసమెరుపు.
‘పిచ్’ పంచాయతీ
Published Thu, Dec 3 2015 12:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement