పుల్లెల గాయత్రి ‘ట్రిపుల్’ | Sakshi
Sakshi News home page

పుల్లెల గాయత్రి ‘ట్రిపుల్’

Published Mon, Sep 7 2015 1:00 AM

పుల్లెల గాయత్రి ‘ట్రిపుల్’

 ఆలిండియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్

 సాక్షి, హైదరాబాద్ : ఆలిండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో పుల్లెల గాయత్రి గోపీచంద్ సత్తా చాటింది. కర్ణాటకలోని గుల్బర్గాలో ఆదివారం ముగిసిన ఈ పోటీల్లో మూడు విభాగాల్లో ఆమె విజేతగా నిలవడం విశేషం. బాలికల అండర్-13, అండర్-15 సింగిల్స్ విభాగాలతో పాటు బాలికల అండర్-15 డబుల్స్‌లో గాయత్రి టైటిల్స్ గెలుచుకుంది. బాలికల అండర్-15 ఫైనల్లో గాయత్రి 15-21, 23-21, 21-8 స్కోరుతో ఏడో సీడ్ మాళవిక బన్సోద్‌పై విజయం సాధించింది. అండర్-13 ఫైనల్లో టాప్ సీడ్ గాయత్రి 21-10, 21-17తో హైదరాబాద్‌కే చెందిన రెండో సీడ్ సమియా ఫారుఖీని ఓడించింది.

అండర్-15 డబుల్స్ ఫైనల్లో గాయత్రి-జక్కా వైష్ణవి రెడ్డి జోడి 16-21, 21-15, 21-19తో టాప్ సీడ్ సిమ్రాన్-రితిక జంటపై నెగ్గింది. అండర్-13 బాలికల డబుల్స్ ఫైనల్లో సమియా ఫారూఖీ-కవిప్రియ ద్వయం 21-11, 21-14తో శ్రీయ చితూర్-కె. భార్గవిపై విజయం సాధించింది.

Advertisement
Advertisement