ఆ ఇద్దరి భారత క్రికెటర్లపైనే దృష్టి! | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరి భారత క్రికెటర్లపైనే దృష్టి!

Published Fri, Jul 8 2016 6:15 PM

India to focus on Shikhar Dhawan, Mohammed Shami in first tour game in West Indies

సెయింట్ కిట్స్:ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెట జట్టు ప్రధానంగా ఇద్దరు ఆటగాళ్లపై దృష్టి పెట్టింది. ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే పర్యవేక్షణలో తొలి విదేశీ పర్యటనలో పాల్గొనబోతున్న టీమిండియా శనివారం వార్మప్ మ్యాచ్ను ఆడనుంది. దీనిలో భాగంగా భారత జట్టు ప్రధాన పేసర్ మొహ్మద్ షమీతో పాటు, ఓపెనర్ శిఖర్ ధవన్ల ప్రదర్శనపై మేనేజ్మెంట్ దృష్టి సారించింది. గతేడాది మార్చి నెల నుంచి అంతర్జాతీయ మ్యాచ్లకు షమీ దూరంగా ఉండటంతో అతని ఫామ్ ను, ఫిట్ నెస్ ను పరీక్షించనుంది. ఇక శిఖర్ విషయంలో టీమిండియా కాస్త ఆందోళనగానే ఉంది. అంతకుముందు టీమిండియా ఆడిన మ్యాచ్ల్లో శిఖర్ నిలకడలేమి జట్టును కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి ఆటగాళ్ల ప్రదర్శన ను నిశితంగా పరీక్షించేందుకు సిద్ధమైంది. దీంతో  శిఖర్, షమీలు తమ సత్తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.

వెస్టిండీస్ ప్రెసిడెంట్ ఎలెవన్తో భారత జట్టు రేపట్నుంచి రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. టెస్టు సిరీస్ సన్నాహకంలో భాగంగా ముందుగా జరిగే ఈ వార్మప్ మ్యాచ్కు భారత జట్టు సీరియస్గానే సన్నద్ధమవుతోంది. ఆ తరువాత జులై 21 నుంచి 25 వరకు ఆంటిగ్వాలో తొలి టెస్టు జరుగనుండగా, జూలై 30 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకూ కింగ్ స్టన్లో రెండో టెస్టు, ఆగస్టు 9 నుంచి 13వ తేదీ వరకూ గ్రాస్ ఐస్లెట్లో మూడో టెస్టు, ఆగస్టు 18 నుంచి 22 వరకూ ట్రినిడాడ్లో నాల్గో టెస్టు జరుగనుంది.

Advertisement
Advertisement