నేడు అంధుల టి20 ప్రపంచకప్ ఫైనల్
బెంగళూరు: సొంతగడ్డపై టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో భారత్... క్రితం సారి ఫైనల్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో పాకిస్తాన్... ఈ నేపథ్యంలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం జరిగే అంధుల టి20 ప్రపంచకప్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.
లీగ్ దశలో పాకిస్తాన్ చేతిలో ఎదురైన పరాజయానికి లెక్క సరిచేయాలని భారత్ కృతనిశ్చయంతో ఉంది. మరోవైపు ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్లోనూ ఓడని పాకిస్తాన్ అదే జోరును ఫైనల్లోనూ కొనసాగించాలని భావిస్తోంది. శనివారం జరిగిన రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్ 147 పరుగుల ఆధిక్యంతో ఇంగ్లండ్ను ఓడించింది.