రాంచీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు దీటుగా బదులిస్తోంది. టాప్-3 ఆటగాళ్లు యాభై అంతకంటే ఎక్కువ వ్యక్తిగత పరుగులు సాధించి భారత్ ఇన్నింగ్స్ కు చక్కటి పునాది వేశారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్(67), మురళీ విజయ్(82) హాఫ్ సెంచరీలు సాధించగా, ఆ తరువాత ఫస్ట డౌన్ లో వచ్చిన చటేశ్వర పూజారా కూడా యాభైకి పైగా పరుగులు నమోదు చేశాడు.
ఇలా ఒక సిరీస్ మూడో టెస్టు మ్యాచ్ లో భారత్ టాప్-3 ఆటగాళ్లు యాభై అంతకంటే ఎక్కువ పరుగులు చేయడం ఏడేళ్ల తరువాత ఇదే తొలిసారి. 2010లో చివరిసారి భారత్ టాప్-3 ఆటగాళ్లు ఈ ఘనతను సాధించారు. న్యూజిలాండ్ తో నాగ్ పూర్ లో జరిగిన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ టాపార్డర్ విశేషంగా రాణించింది. కాగా, 2006 నుంచి 2010 వరకూ చూస్తే భారత టాప్-3 ఆటగాళ్లు ఈ తరహా ఇన్నింగ్స్ లను ఎనిమిదిసార్లు నమోదు చేయగా.. ఆ తరువాత ఆ ఫీట్ ను ఒకసారి మాత్రమే సాధించడం ఇక్కడ గమనించాల్సిన విషయం.