ఇక పరువు కోసం పోరాటం | Sakshi
Sakshi News home page

ఇక పరువు కోసం పోరాటం

Published Fri, Feb 14 2014 1:40 AM

ఇక పరువు కోసం పోరాటం - Sakshi

న్యూజిలాండ్‌తో భారత్
 రెండో టెస్టు నేటి నుంచే
 
 తెల్లవారు జామున 3.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
 
 వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పర్యటనను కాస్తయినా గౌరవంగా ముగించేందుకు టీమిండియాకు చివరి అవకాశం. టూర్‌లో చివరి మ్యాచ్, రెండో టెస్టు శుక్రవారం ప్రారంభం కానుంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను కోల్పోవడంతోపాటు తొలిటెస్టులోనూ ఓటమిపాలైన నేపథ్యంలో ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని ధోనిసేన భావిస్తోంది.

ఆక్లాండ్ టెస్టులో ఓడినా.. భారీ లక్ష్యఛేదనలో చివరివరకూ పోరాడిన తీరు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. కివీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో భారీస్కోరు చేయనిచ్చినా, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 105 పరుగులకే కట్టడి చేయడం ద్వారా బౌలర్లు గాడిలో పడ్డారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన భారత బ్యాట్స్‌మెన్.. రెండో ఇన్నింగ్స్‌లో చెప్పుకోదగ్గ స్థాయిలోనే రాణించారు.
 
 జట్టు కూర్పు పరంగా మార్పులు దాదాపుగా ఉండకపోవచ్చు. అశ్విన్‌కు మరోసారి తుదిజట్టులో స్థానం లేనట్లే. మరోవైపు కివీస్ జట్టులో సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడంలేదు. టెస్టు మ్యాచ్ జరిగే సమయంలోనే తన భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉండడంతో అతడు వైదొలిగాడు.
 

Advertisement
Advertisement