బ్రేవో ఇంట భారత ఆటగాళ్ల సందడి | Sakshi
Sakshi News home page

బ్రేవో ఇంట భారత ఆటగాళ్ల సందడి

Published Tue, Jun 27 2017 2:26 AM

బ్రేవో ఇంట భారత ఆటగాళ్ల సందడి

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: కరీబియన్‌ పర్యటనలో ఉన్న భారత క్రికెటర్లు వెస్టిండీస్‌ ఆటగాడు డ్వేన్‌ బ్రేవో ఇంట సందడి చేశారు. అతడి ఆహ్వానం మేరకు కెప్టెన్‌ కోహ్లి, ధోని, రహానే సహా సభ్యులంతా డిన్నర్‌కు వెళ్లారు. భారత ఆటగాళ్లతో బ్రేవోకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ సందడిని ఆటగాళ్లు తమ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో పంచుకున్నారు. ధోని తన కూతురు జీవాతో కలిసి బ్రేవో అతడి తల్లితో ఫొటో దిగగా.. కోహ్లి, రహానే, ధావన్, బ్రేవో పార్టీని ఆస్వాదిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పంచుకున్నారు. ఐపీఎల్‌లో బ్రేవో మొదట చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఆడగా ఆ తర్వాత గుజరాత్‌ లయన్స్‌కు మారిన విషయం తెలిసిందే. ‘నా సోదరుడు ధోని తన కూతురితో కలిసి మా ఇంటికి వచ్చినందుకు సంతోషంగా ఉంది’ అని బ్రేవో ట్వీట్‌ చేశాడు.

Advertisement
Advertisement