- ఒలింపియాడ్లో తొలిసారి కాంస్యం
- పద్మిని రౌత్కు స్వర్ణం
ట్రోమ్సో (నార్వే): విశ్వనాథన్ ఆనంద్... పెంటేల హరికృష్ణ... సూర్యశేఖర గంగూలీలాంటి అగ్రశ్రేణి క్రీడాకారులు లేకపోయినా... ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్లో భారత పురుషుల జట్టు అద్వితీయ ప్రదర్శన కనబరిచింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో తొలిసారి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. పరిమార్జన్ నేగి (న్యూఢిల్లీ), కృష్ణన్ శశికిరణ్, సేతురామన్, అధిబన్ (తమిళనాడు), లలిత్ బాబు (ఆంధ్రప్రదేశ్)లతో కూడిన భారత బృందం ఓపెన్ విభాగంలో మూడో స్థానంలో నిలిచింది. గురువారం ముగిసిన ఈ పోటీల్లో నిర్ణీత 11 రౌండ్ల తర్వాత భారత జట్టు 17 పాయింట్లతో మరో మూడు జట్లతో ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచింది. అయితే టైబ్రేక్ పాయింట్ల ఆధారంగా ర్యాంక్ను వర్గీకరించగా భారత్కు మూడో స్థానం... హంగేరికి రెండో స్థానం దక్కాయి.
19 పాయింట్లతో చైనా స్వర్ణ పతకాన్ని సాధించింది. ఓపెన్ విభాగంలో మొత్తం 150 దేశాలు పాల్గొన్నాయి. చివరిదైన 11వ రౌండ్లో భారత్ 3.5-0.5తో ఉజ్బెకిస్థాన్ జట్టును ఓడించింది. పరిమార్జన్ నేగి 69 ఎత్తుల్లో ప్రపంచ మాజీ చాంపియన్ రుస్తుమ్ కాసిమ్జనోవ్ను ఓడించగా... సేతురామన్ 74 ఎత్తుల్లో ఫ్లిపోవ్పై; శశికిరణ్ 47 ఎత్తుల్లో జువయేవ్పై గెలిచారు. అధిబన్, వఖిదోవ్ల మధ్య గేమ్ 80 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. వ్యక్తిగత విభాగాల్లో బోర్డు-3 మీద ఆడిన శశికిరణ్ 7.5పాయింట్లతో రజత పతకాన్ని సాధించాడు.
మహిళల విభాగంలో భారత జట్టు 15 పాయింట్లతో 10వ స్థానంలో నిలిచింది. రుమేనియాతో జరిగిన చివరిదైన 11వ రౌండ్ను టీమిండియా 2-2తో ‘డ్రా’ చేసుకుంది. వ్యక్తిగత విభాగంలో బోర్డు-5 మీద ఆడిన ఒడిశా అమ్మాయి పద్మిని రౌత్ 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
చెస్ జట్టు కొత్త చరిత్ర
Published Fri, Aug 15 2014 1:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement