విజేత భారత్‌ | Sakshi
Sakshi News home page

విజేత భారత్‌

Published Tue, Mar 12 2019 10:18 AM

India Won Indo Thai Throwball Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇండో–థాయ్‌ త్రోబాల్‌ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు విజేతగా నిలిచింది. బ్యాంకాక్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీలో టైటిల్‌ను కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ 25–23, 25–20తో థాయ్‌లాండ్‌ జట్టుపై పోరాడి గెలిచింది. ఈ సందర్భంగా థాయ్‌లాండ్‌ ఆసియా త్రోబాల్‌ కార్యదర్శి మొహమ్మద్‌ లతీఫుద్దీన్, థాయ్‌లాండ్‌ కార్యదర్శి మన్నత్‌ బూన్‌చాన్‌ భారత జట్టును అభినందించారు.

 ,

Advertisement
Advertisement