విశాఖపట్నం, న్యూస్లైన్: సీనియర్ స్థాయిలోనే కాదు... జూనియర్ స్థాయిలోనూ ప్రపంచ క్రికెట్లో భారత్ తిరుగులేని శక్తిగా మారుతోంది. అండర్-19 నాలుగు దేశాల వన్డే టోర్నీలో భారత కుర్రాళ్లు ఇదే నిరూపించారు. టోర్నీ అంతటా నిలకడగా రాణించడంతో పాటు ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకున్నారు. వైఎస్ఆర్ ఏసీఏ - వీడీసీఏ స్టేడియంలో శనివారం జరిగిన తుది పోరులో భారత్ అండర్-19 జట్టు ఏకంగా 201 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా అండర్-19 జట్టును చిత్తుగా ఓడించింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 267 పరుగులు చేసింది. మూడు పరుగులకే తొలి వికెట్ కోల్పోయినా కెప్టెన్ విజయ్ జోల్ (90 బంతుల్లో 71; 6 ఫోర్లు; 1 సిక్స్) చక్కటి ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. రికీ భుయ్ (53 బంతుల్లో 46; 3 ఫోర్లు; 1 సిక్స్)తో కలిసి నాలుగో వికెట్కు 61 పరుగులు జత చేశాడు.
ఆ తర్వాత ముంబై చిచ్చర పిడుగు, 15 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ (58 బంతుల్లో 67 నాటౌట్; 6 ఫోర్లు) వేగంగా ఆడి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. జస్టిన్ డిల్కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్కు దిగిన సఫారీ జట్టు భారత స్పిన్ ధాటికి చేతులెత్తేసింది. 28.1 ఓవర్లలో కేవలం 66 పరుగులకే ఆలౌటయింది. 13 పరుగుల స్కోరు వద్ద మూడు వికెట్లు పడినప్పటి నుంచి ఆ జట్టు కోలుకోలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి తొమ్మిది మంది బ్యాట్స్మెన్ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు.
జేసన్ స్మిత్ (41 బంతుల్లో 23; 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆమిర్ గనికి మూడు, కుల్దీప్ యాదవ్కు రెండు వికెట్లు దక్కాయి. బ్యాటింగ్లో చెలరేగిన సర్ఫరాజ్ తన స్పిన్ బౌలింగ్తోనూ రెండు వికెట్లతో సత్తా చాటుకున్నాడు. మూడో స్థానానికి జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్లో జింబాబ్వేపై ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత జింబాబ్వే 50 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆసీస్ 41.3 ఓవర్లలో రెండు వికెట్లను కోల్పోయి 229 పరుగులు చేసి గెలిచింది.
భారత కుర్రాళ్లకు టైటిల్
Published Sun, Oct 6 2013 1:38 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
Advertisement