సానియా, పేస్ జోడీల శుభారంభం | Sakshi
Sakshi News home page

సానియా, పేస్ జోడీల శుభారంభం

Published Wed, May 27 2015 7:20 PM

Indian pairs advance at French Open

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో భారత ఆటగాళ్లు శుభారంభం చేశారు. మహిళల డబుల్స్లో సానియా మీర్జా, పురుషుల డబుల్స్లో లియాండర్ పేస్, రోహన్ బోపన్న జోడీలు ముందంజ వేశాయి.

మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో సానియా-మార్టినా హింగిస్ 6-3 6-0 స్కోరుతో జులియా జార్జెస్ (జర్మనీ)- బార్బొరా క్రెజికొవా (చెక్ రిపబ్లిక్)పై అలవోకగా గెలుపొందారు. పురుషుల డబుల్స్లో పేస్-డానియల్ నెస్టర్ (కెనడా)  6-2, 5-7, 7-5 స్కోరుతో జేమ్స్ డక్వర్త్, క్రిస్ గుకీనె (ఆస్ట్రేలియా)పై విజయం సాధించింది. మరో మ్యాచ్లో బోపన్న-ఫ్లోరిన్ 5-7, 6-3, 6-4 స్కోరుతో సెర్బియా ద్వయం ఫిలిప్ క్రజినోవిచ్-విక్టర్ ట్రోకీపై నెగ్గారు.
 

Advertisement
Advertisement