ముంబై: అండర్–19 ప్రపంచకప్కు భారత జట్టును సన్నద్ధం చేసిన కోచ్ రాహుల్ ద్రవిడ్ తమ సేనలోని కుర్రాళ్లను త్వరలోనే భారత్ ‘ఎ’జట్టులో చూడాలనుకుంటున్నారు. న్యూజిలాండ్ ఆతిథ్యమిచ్చే ఈ జూనియర్ ప్రపంచకప్ కోసం భారత అండర్–19 జట్టు గురువారం ఉదయం బయల్దేరనుంది. ఈ సందర్భంగా కోచ్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడుతూ... ‘ఎంపికైన కుర్రాళ్లెవరికీ కివీస్లో ఆడిన అనుభవమే లేదు. దీంతో ఈ ప్రపంచకప్ వాళ్లకు పెద్ద చాలెంజ్. అక్కడ రాణిస్తే తిరుగుండదు. బహుశా వచ్చే 6–8 నెలల్లో భారత్ ‘ఎ’ జట్టుకు ఆడినా ఆడవచ్చు. వాళ్లకది గొప్ప ఘనత అవుతుంది. ఆపై సీనియర్ జట్టుకూ ఎంపిక కావచ్చు’ అని అన్నారు. అయితే వీళ్లలో ఎవరు మేటి ఆటగాళ్లవుతారు? ఎవరు జాతీయ జట్టులోకి ఎంపికవుతారని చెప్పడం తగదన్నారు. ఈ యువ జట్టు కెప్టెన్ పృథ్వీ షా ఇప్పటికే భారత్ ‘ఎ’ తరఫున న్యూజిలాండ్తో వార్మప్ మ్యాచ్లు ఆడాడు. ‘భారత ‘ఎ’, అండర్–19 జట్ల కోచ్గా నేనెంతో నేర్చుకున్నాను. ఈ తరం కుర్రాళ్లది పూర్తిగా భిన్నమైన నేపథ్యం. వాళ్ల ఆలోచనలు కూడా భిన్నమే. మూడు ఫార్మాట్లను ఆకళింపు చేసుకోగలరు. నిజంగా ఇది పెను సవాల్. ఎందుకంటే ఇప్పుడు ఆట ఎంతో మారింది’ అని ద్రవిడ్ అన్నారు.
వచ్చే నెల 13 నుంచి కివీస్లో జరిగే మెగా ఈవెంట్లో పృథ్వీ షా సేన చక్కగా రాణిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ముందుగా కివీస్ పరిస్థితులకు అలవాటు పడాలన్నారు. బెంగళూరులో నిర్వహించిన శిబిరంలో అలాంటి వాతావరణం కల్పించినప్పటికీ భౌగోళిక పరిస్థితుల వల్ల అది సాధ్యం కాలేదని చెప్పారు. కెప్టెన్ పృథ్వీ షా మాట్లాడుతూ ‘సారథిగా నాకు ఇది సువర్ణావకాశం. అంచనాలకు అనుగుణంగా జట్టును నడిపిస్తాను. ప్రతి ఆటగాడికి తమ వంతు బాధ్యత తెలుసు. భారత్ను విజేతగా నిలిపేందుకు వారం తా కష్టపడతారు’ అని అన్నాడు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ మ్యాచ్లతో స్థానిక వాతావరణానికి అలవాటు పడతామని చెప్పాడు. అండర్–19 మెగా ఈవెంట్ చరిత్రలో భారత్ మూడు సార్లు చాంపియన్గా నిలిచింది. గత టోర్నీలో రన్నరప్గా నిలిచిన ఈ జట్టు ప్రస్తుత టోర్నీలో ఆస్ట్రేలియా, జింబాబ్వే, పపువా న్యుగినియా జట్లతో కలిసి గ్రూప్ ‘బి’లో ఉంది. మరోవైపు సీనియర్ జట్టు కెప్టెన్ కోహ్లి అండర్–19 ఆటగాళ్లతో ప్రత్యే కంగా ముచ్చటించి వాళ్లలో స్ఫూర్తి నింపాడు.
కుర్రాళ్లకు ఇదో సవాల్!
Published Thu, Dec 28 2017 12:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement